అన్వేషించండి

Crime News: భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..

Meerpet Murder Case: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన మీర్‌పేట్ మహిళ హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు రక్తపు ఆనవాళ్లు గుర్తించారు.

Police Investigation Ongoing In Meerpet Woman Murder Case: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ మహిళ మర్డర్ (Meerpet Murder Case) కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు రెండుసార్లు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుడు గురుమూర్తి పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. గురువారం పిల్లల స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు. సంక్రాంతికి ఊరెళ్లి వచ్చిన తర్వాత కూతురు అమ్మ ఎక్కడ అని అడిగితే తన తండ్రి మౌనంగా ఉండిపోయినట్లు చెబుతోంది. ఇంట్లో భరించలేని దుర్వాసన వచ్చిందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అటు, గురుమూర్తి ఇంటిని పోలీసులు మరోసారి తనిఖీ చేశారు. గురుమూర్తి తన భార్య మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లను గుర్తించారు. మాధవి హెయిర్ శాంపిల్స్ కాలిన స్థితిలో దొరికాయి. వీటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా నేర నిరూపణ సాధ్యమని భావిస్తున్నారు. ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు.

పూటకో మాట..

నిందితుడు గురుమూర్తి పూటకో మాట చెబుతూ పొంతన లేని సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు షాక్ అవుతున్నారు. తన భార్యను తానే చంపినట్లు నేరం అంగీకరించిన నిందితుడు.. ఆ తర్వాత ఆధారాలు ఏమైనా ఉన్నాయా.? అంటూ పోలీసులనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను కోర్టులో తేల్చుకుంటానంటూ వారికి సవాల్ చేసినట్లు సమాచారం. అటు, ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు కొందరు ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. వీరు రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పీఎస్ పరిధిలోని బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యను చంపడానికి ముందే పిల్లలను పండగ సెలవులకు హైదరాబాద్‌లోనే ఉంటున్న తాతగారి ఇంటికి పంపేశాడు. సంక్రాంతి రోజున భార్యను హత్య చేసిన అనంతరం మటన్ నరికే కత్తితో మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను కుక్కర్ లో ఉడికించాడు. అనంతరం వాటిని రోకలితో దంచి పొడి చేశాడు. ఆ పొడిని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. ఈ నెల 17న అత్తగారికి ఫోన్ చేసి భార్య కనిపించడం లేదని చెప్పాడు. కూతురు అదృశ్యంపై వారు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు భర్త గురుమూర్తిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిందితుడని తేలింది. భార్యను చంపడానికి ముందు ఓ కుక్కను చంపి ముక్కలుగా నరికి ట్రయల్ వేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది.

అనుమానమా..? వివాహేతర సంబంధమా..?

అయితే, తొలుత అనుమానంతోనే భార్యను హత్య చేసినట్లు భావించిన పోలీసులకు విచారణలో మరిన్ని విషయాలు తెలిశాయి. నిందితునికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తన భార్యను చంపి ఉంటాడని భావిస్తున్నారు. గురుమూర్తి ఫోన్ చూసిన పోలీసులకు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.

Also Read: Fire Accident: మాదాపూర్ మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన కార్లు, భారీగా ఆస్తి నష్టం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Embed widget