అన్వేషించండి

Crime News: భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..

Meerpet Murder Case: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన మీర్‌పేట్ మహిళ హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు రక్తపు ఆనవాళ్లు గుర్తించారు.

Police Investigation Ongoing In Meerpet Woman Murder Case: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ మహిళ మర్డర్ (Meerpet Murder Case) కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు రెండుసార్లు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుడు గురుమూర్తి పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. గురువారం పిల్లల స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు. సంక్రాంతికి ఊరెళ్లి వచ్చిన తర్వాత కూతురు అమ్మ ఎక్కడ అని అడిగితే తన తండ్రి మౌనంగా ఉండిపోయినట్లు చెబుతోంది. ఇంట్లో భరించలేని దుర్వాసన వచ్చిందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అటు, గురుమూర్తి ఇంటిని పోలీసులు మరోసారి తనిఖీ చేశారు. గురుమూర్తి తన భార్య మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లను గుర్తించారు. మాధవి హెయిర్ శాంపిల్స్ కాలిన స్థితిలో దొరికాయి. వీటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా నేర నిరూపణ సాధ్యమని భావిస్తున్నారు. ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు.

పూటకో మాట..

నిందితుడు గురుమూర్తి పూటకో మాట చెబుతూ పొంతన లేని సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు షాక్ అవుతున్నారు. తన భార్యను తానే చంపినట్లు నేరం అంగీకరించిన నిందితుడు.. ఆ తర్వాత ఆధారాలు ఏమైనా ఉన్నాయా.? అంటూ పోలీసులనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను కోర్టులో తేల్చుకుంటానంటూ వారికి సవాల్ చేసినట్లు సమాచారం. అటు, ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు కొందరు ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. వీరు రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పీఎస్ పరిధిలోని బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యను చంపడానికి ముందే పిల్లలను పండగ సెలవులకు హైదరాబాద్‌లోనే ఉంటున్న తాతగారి ఇంటికి పంపేశాడు. సంక్రాంతి రోజున భార్యను హత్య చేసిన అనంతరం మటన్ నరికే కత్తితో మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను కుక్కర్ లో ఉడికించాడు. అనంతరం వాటిని రోకలితో దంచి పొడి చేశాడు. ఆ పొడిని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. ఈ నెల 17న అత్తగారికి ఫోన్ చేసి భార్య కనిపించడం లేదని చెప్పాడు. కూతురు అదృశ్యంపై వారు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు భర్త గురుమూర్తిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిందితుడని తేలింది. భార్యను చంపడానికి ముందు ఓ కుక్కను చంపి ముక్కలుగా నరికి ట్రయల్ వేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది.

అనుమానమా..? వివాహేతర సంబంధమా..?

అయితే, తొలుత అనుమానంతోనే భార్యను హత్య చేసినట్లు భావించిన పోలీసులకు విచారణలో మరిన్ని విషయాలు తెలిశాయి. నిందితునికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తన భార్యను చంపి ఉంటాడని భావిస్తున్నారు. గురుమూర్తి ఫోన్ చూసిన పోలీసులకు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.

Also Read: Fire Accident: మాదాపూర్ మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన కార్లు, భారీగా ఆస్తి నష్టం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget