అన్వేషించండి

Nellore Girl Kidnap: నెల్లూరులో బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, గంటల వ్యవధిలో కిడ్నాపర్ అరెస్ట్

నెల్లూరు జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆ బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు.

నెల్లూరు జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆ బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ ని పట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆందోళనను తీర్చారు. జిల్లా పోలీసులు చాకచక్యంతో కిడ్నాప్ కేసుని ఛేదించి మైనర్ బాలికను సురక్షితంగా విడిపించారు.

అసలేం జరిగింది..?

మంగళవారం ఉదయం నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలం ఏసీ కాలనీ లో అప్పర్ ప్రైమరీ స్కీల్ లో మూడో తరగతి చదువుకునే బాలిక ను ఓ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. బాలికకు తాను మేనత్తను అని చెప్పి స్కూల్ నుంచి పాపను తీసుకెళ్లింది. బాలికకు తినుబండారాలు కొనిచ్చి తిరిగి తీసుకొస్తానని ఆ మహిళ స్కూల్ టీచర్లకు చెప్పి పాపను తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎంత సేపటికి ఆమె తిరిగి రాలేదు. దీంతో పాపకోసం వేచి చూసిన టీచర్ చివరకు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు వారు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. దుత్తలూరు నుంచి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు జల్లెడ పడ్డారు. చివరకు బైక్ పై మైనర్ బాలికను తీసుకెళ్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద పోలీసులకు చిక్కారు. వెంటనే పాపను పోలీసులు దుత్తలూరుకి తీసుకొచ్చారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకిదంతా.. ?

మైనర్ బాలిక పెదనాన్న ఓ వ్యక్తి దగ్గర పెద్ద మొత్తం అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలని అడినా ఆయన తిరిగివ్వలేకపోయాడు. దీంతో పాపను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని భావించారు. దీనికోసం పాపకు మేనత్త వరుస అయ్యే మహిళను దుండగులు సంప్రదించారు. పాపను స్కూల్ నుంచి బయటకు తీసుకొస్తే చాలని, ఆ తర్వాత తాము పని పూర్తి చేస్తామని చెప్పి ఆమెకు డబ్బు ఆశ చూపించారు. దీంతో ఆమె పాపను బయటకు తీసుకొచ్చింది. ఆ పాపను దుండగులు బైక్ పై ఎక్కించుకుని దాచేపల్లి వైపు వెళ్లారు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో వ్యవహారం బయటపడింది. పోలీసులు వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని పాపను రక్షించారు.

పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. దుత్తలూరునుంచి అన్నివైపులా జిల్లా పోలీసులు చెక్ పోస్ట్ ల వద్ద నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వెళ్లేవారిని ఆపి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పాపను బైక్ పై కూర్చోబెట్టుకుని ఆదుర్దాగా వెళ్తున్న జంటను దాచేపల్లి వద్ద పోలీసులు ఆపి ప్రశ్నించారు. వారు తడబడటంతో వెంటనే అదుపులోకి తీసుకుని అసలు విషయం రాబట్టారు. నిందితులు ఆ పాపను వరంగల్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. శీనయ్య, వెంకటరమణమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

గంటల వ్యవధిలోనే ఈ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపారు. ఇకపై స్కూల్ కి ఎవరైనా వచ్చి వారి బంధువులమంటూ పిల్లల్ని తీసుకెళ్లాలని చూస్తే, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు పోలీసులు. అపరిచిత వ్యక్తులకు పిల్లలను అప్పగించవద్దని హెచ్చరిస్తున్నారు. అనుమానం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget