అన్వేషించండి

BMW Hit And Run Case: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షా అరెస్ట్

Mumbai Hit And Run Case : బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిహిర్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం యాక్సిడెంట్ చేసి తర్వాత పరారయ్యారు.

BMW Hit And Run Case:  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మద్యం మత్తులో ర్యాష్​ డ్రైవింగ్‌ చేసి ఓ వివాహిత మరణానికి కారణం కావడం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో మూడు రోజులుగా పరారీలో ఉన్న  ప్రధాన నిందితుడు మిహిర్ షాను పోలీసులు మంగళవారం (జులై 9న) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపారు. అతను నడుపుతున్న కారు ముంబైలోని వర్లీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. మిహిర్ షా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు యాక్సిడెంట్ చేసి తర్వాత పరారయ్యారు.   

11 టీమ్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
మిహిర్‌ను ముంబై సమీపంలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. 72 గంట‌ల త‌ర్వాత ముంబయికి 65 కి.మీ. దూరంలో ఉన్న విరార్‌లోని అపార్ట్‌మెంట్‌లో మిహిర్ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లి, సోదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన కొడుకు తప్పించుకోవడంలో మిహిర్ తండ్రి రాజేష్ షా కీలక పాత్ర పోషించాడని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని అక్కడి నుంచి తరలించేందుకు కుట్ర పన్నాడని చెప్పుకొచ్చారు. మిహిర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 11 బృందాలను ఏర్పాటు చేశారు. క్రైమ్ బ్రాంచ్‌ను కూడా విచారణలో చేర్చారు.  పోలీసులు అతనిపై లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) కూడా జారీ చేశారు. ఇక మిహిర్ అరెస్టుకు ముందు అత‌డి తప్పతాగి రూ. 18 వేల బిల్ చేసిన ద వైస్ గ్లోబల్ తపస్ బార్‌ను ముంబై పోలీసులు సీజ్ చేశారు. 

 ప్రమాదం ఎలా జరిగిందంటే ?  
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్లి కోలివాడలో నివాసముంటున్న కావేరి నఖ్వా (45) ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తన భర్త ప్రదీప్‌తో కలిసి డాక్టర్ అన్నీ బిసెంట్ రోడ్డు గుండా వెళ్తున్నారు. అదే సమయంలో బిఎమ్‌డబ్ల్యూలో వెళుతున్న మిహిర్ షా దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  బాధితురాలు కావేరీ నక్వాను నిందితుడు మిహిర్‌ షా కారు త‌న‌ బానెట్‌పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.  కారు బ‌లంగా ఢీకొట్టడంతోనే కావేరీ ఎగిరి కారు బానెట్‌పై పడింది.  అలాగే కిలోమీటర్‌ వెళ్లిన తర్వాత కారుమీదున్న బాడీని కిందకు పడేశారు. అనంతరం అదే కారు రివర్స్‌ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు కోర్టులో వెల్లడించారు.  

మిహిర్ తండ్రి అరెస్ట్
మహిళను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత మిహిర్ షా బాంద్రా-వర్లీ సీ లింక్ వైపు పరారయ్యారు. మిహిర్ తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు వర్లీ పోలీసులు మిహిర్ తండ్రి రాజేష్ షా, డ్రైవర్ బిదావత్‌లను ఆదివారం అరెస్టు చేశారు. ఆ కారు రాజేష్ షా పేరు మీద ఉంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న తన డ్రైవర్ రాజర్షి బిదావత్‌ను ఈ సంఘటనకు బాధ్యత వహించాలని రాజేష్ షా కోరారు. కావేరీ నఖ్వాను కారుతో కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లినట్లు కనిపించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు కోర్టులో సమర్పించారు. ఈ ఫోటోల్లో మిహిర్ షా, సహ నిందితుడు రాజర్షి బిదావత్ మహిళను బానెట్ నుండి లాగడం, ఆమెను రోడ్డుపై ఉంచడం, కారును రివర్స్‌లో  ఆమె పైనుంచి పోనించడం చూడవచ్చు. ఘటన జరిగిన తర్వాత రాజేష్ షా కూడా ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లినట్లు సమాచారం.

కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు
కొత్త ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ  ప్రమాదం పుణెలో జ‌రిగిన పోర్చే కారు ఘటనను గుర్తుకు తెచ్చింది. 

టాప్ హెడ్ లైన్స్

Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget