అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  ECI | ABP NEWS)

Crime News: పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం

Pithapuram News: కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు ఓ మహిళ సహకరించింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.

Minor Abused By A Man In Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో (Pithapuram) దారుణం జరిగింది. ఓ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్టువర్టుపేటలో నడిచి వెళ్తోన్న బాలికను.. ఓ వ్యక్తి, మరో మహిళ ఓ కాగితం చూపించి అడ్రస్ అడిగారు. ఆమె అడ్రస్ చెబుతుండగా.. మత్తు మందు స్ప్రే చేసి ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం పిఠాపురం శివారు మాధవపురం రోడ్డులోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికకు బలవంతంగా మద్యం తాగించి సదరు వ్యక్తి ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. 

దీంతో బాలికను ఆటోలో ఎక్కించేందుకు వారు ప్రయత్నిస్తుండగా.. గమనించిన ప్లాస్టిక్ వస్తువులు సేకరించే మహిళ అనుమానంతో వారిని ప్రశ్నించింది. బాలిక ముఖం గుర్తు పట్టి వారి బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ పట్టుకున్నారు. బాలికను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికను కిడ్నాప్ చేసి మద్యం తాగించి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఓ పార్టీ నాయకురాలి భర్త అని తెలుస్తోంది.

'బాలికపై అఘాయిత్యం అమానుషం'

అటు, ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో స్థానికులు స్పందించి నిందితున్ని పట్టి పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని.. లేదంటే నిందితుడు తప్పించుకునేందుకు ఆస్కారం కలిగేదని అన్నారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. 'ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే బాలికను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను. ప్రభుత్వ పరంగా బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులు అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆదేశించాను.' అని పవన్ పేర్కొన్నారు.

Also Read: Andhra University: అమ్మాయిలు డ్యాన్స్ చేయాలంటూ ర్యాగింగ్ - ఏయూలో 10 మంది సీనియర్ల సస్పెన్షన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Awards Ceremony 2024: రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
Pawan Kalyan: ఈ 14 నుంచి ఏపీ వ్యాప్తంగా ‘పల్లె పండుగ’- 30 వేల పనులకు శ్రీకారం
ఈ 14 నుంచి ఏపీ వ్యాప్తంగా ‘పల్లె పండుగ’- 30 వేల పనులకు శ్రీకారం: పవన్ కళ్యాణ్
Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
Mukesh Ambani: రూ.10 వేల పెట్టుబడి రూ.9 లక్షలు అయింది, అంబానీకి చెందిన చాక్లెట్‌ కంపెనీ అదరగొట్టింది
రూ.10 వేల పెట్టుబడి రూ.9 లక్షలు అయింది, అంబానీకి చెందిన చాక్లెట్‌ కంపెనీ అదరగొట్టింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AAP Huge Loss in Haryana Elections | కేజ్రీవాల్ కు హర్యానాలో ఊహించని దెబ్బ | ABP DesamISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలురూ.6.6 కోట్ల నోట్ల కట్టలతో అమ్మవారికి అలంకరణరెండు కీలకమైన ఘట్టాల తర్వాత బీజేపీకి తలబొప్పి కట్టిందేంటీ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Awards Ceremony 2024: రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
Pawan Kalyan: ఈ 14 నుంచి ఏపీ వ్యాప్తంగా ‘పల్లె పండుగ’- 30 వేల పనులకు శ్రీకారం
ఈ 14 నుంచి ఏపీ వ్యాప్తంగా ‘పల్లె పండుగ’- 30 వేల పనులకు శ్రీకారం: పవన్ కళ్యాణ్
Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
Mukesh Ambani: రూ.10 వేల పెట్టుబడి రూ.9 లక్షలు అయింది, అంబానీకి చెందిన చాక్లెట్‌ కంపెనీ అదరగొట్టింది
రూ.10 వేల పెట్టుబడి రూ.9 లక్షలు అయింది, అంబానీకి చెందిన చాక్లెట్‌ కంపెనీ అదరగొట్టింది
How BJP won in Haryana Elections :  బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం  జరిగింది ?
బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం జరిగింది ?
Jammu Kashmir Election 2024:  నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ
నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ
Crime News: పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం
పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం
Haryana Election 2024 Results : పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్‌!
పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్‌!
Embed widget