అన్వేషించండి

Mancherial News : మంచిర్యాల జిల్లాలో విషాదం, ఇద్దరు కూతుర్లకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య!

Mancherial News :మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు కూతుర్లకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Mancherial News : మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుర్లకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలోని వీకర్స్ కాలనీలో ఉంటున్న చెన్నల ధనలక్ష్మి (23), అనే మహిళ తన కూతుర్లు సమన్విత (6),  శంకరమ్మ (6నెలల చిన్నారి) లకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు పోలీసులు. పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకుందని, భర్త సాయన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన చెన్నల సాయన్న కుటుంబం బతుకు దెరువు కోసం లక్షేట్టిపేటకు వలసవెళ్లారు. తన భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో భర్త సాయన్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచానామా చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.  ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

లోన్ యాప్ వేధింపులతో యువకుడు సూసైడ్ 

తెలుగు రాష్ట్రాల్లో లోన్‌ యాప్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఎంతో ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా నంద్యాలలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. లోన్‌ యాప్‌ నిర్వాహకుల టార్చర్ భరించలేక వీరేంద్ర అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాలలోని బాలాజి కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న వీరేంద్ర బెంగళూరులో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అత్యవసరం అయ్యి ఓ యాప్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవ్వడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు స్టార్ట్ చేశారు. వీరేంద్ర అప్పు చెల్లించాలని అతడి బంధువులు, మిత్రులకు యాప్ నుంచి ఫోన్ చేశారు. 

ఫొటో మార్ఫింగ్ చేసి వేధింపులు 

వీరేంద్ర ఫొటోను మార్ఫింగ్ చేసి ఈ వ్యక్తి మా సంస్థలో లోన్‌ తీసుకొని చెల్లించలేదని ఓ మెసేజ్ జోడించి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే అతడి మిత్రులకు, బంధువులకు మార్ఫింగ్ ఫొటో పెట్టారు. వీరేంద్ర మీ నెంబర్‌ను రిఫరెన్స్‌గా ఇచ్చాడు. అతడు  లోన్ చెల్లించలేదు ఇప్పుడు మీరు లోన్‌ను తిరిగి చెల్లించాలి. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తాం అని మెసేజ్‌లో రాసుకొచ్చారు.  దీంతో అవమానంగా భావించిన వీరేంద్ర శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్‌ వేధింపుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read : Prakasam News : ప్రాణం మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం, ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

 Also Read : Crime News: తాగిన మైకంలో డెలివరీ బాయ్‌ను ఘోరంగా కొట్టిన యువకులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget