అన్వేషించండి

Crime News: ఆర్టీఐ చట్టమే వాళ్ల దందాలకు ఇంధనం- పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు

Crime News: ఆంధ్రప్రదేశ్‌లో రెండు సంచలన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని దందాలు చేస్తున్న ముఠా ఒకటి అయితే. నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ముఠా ఇంకొకటి.

Andhra Pradesh Crime News: ఆర్టీఐ పిటిషన్‌లు వేస్తూ బ్లాక్‌ మెయిల్ చేస్తున్న వ్యక్తులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడిని బెదిరించిన ఈ కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. ఆదోని మండలం బసాపురం వాసులు రఘునాథ్‌, ఆడివేష్‌ ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ దందాలు సాగిస్తున్నారు. వివిధ ఆసుపత్రులపై పిటిషన్లు వేయడం లోపాలు గుర్తించి వారి నుంచి డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారు. అదే మాదిరిగా ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి దమ్కీ ఇచ్చారు. రూ.50లక్షలు డిమాండ్‌ చేశారు. దీనిపై ఆ యాజమాన్యం పోలీసులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు వెళ్లే సరికి వారిపై కూడా నిందితులు తిరగబడ్డారు.  వెంటనే వారిని అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. 

ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు ఏపీ పోలీసులు. ఓ మెకానిక్ ఇచ్చిన సమాచారంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కోటి రూపాయలకుపైగా నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా పోలీసులు సీజ్ చేశారు. 

గుంటూరు కేంద్రంగా ఈ ముఠా నకిలీ నోట్లు ముద్రిస్తూ వస్తోంది. పదిహేను రోజుల క్రితం హరిబాబు అనే వ్యక్తి తన వ్యాన్‌ను రిపేర్ చేయాలని రాంబాబును కలిశాడు. రాంబాబు తన స్నేహితుడు ఆకుల పవన్‌తో కలిసి వ్యాన్‌ను చెక్ చేశారు. రిపేర్‌కు పదివేలు అవుతుందని చెప్పారు. వెంటనే జేబులో ఉన్న రెండు వేల రూపాయలను హరిబాబు వాళ్లకు ఇచ్చేశాడు. మిగిలిన డబ్బులు రిపేర్ పూర్తి అయిన తర్వాత ఇస్తానని చెప్పాడు. 

వ్యాన్ రిపేర్‌కు కావాల్సిన స్పేర్ పార్ట్‌లు కొనేందుకు షాప్‌ వద్దకు వెళ్లాడు రాంబాబు. పార్ట్స్‌ తీసుకొని డబ్బులు ఇచ్చాడు. అవి ఫేక్ నోట్స్‌ అని షాపువాళ్లు చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంటనే బిక్కవోలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

ఫిర్యాదు అందుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అనపర్తి, బిక్కవోలు, రంగంపేట పోలీసులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఇలా పలు ప్రాంతాల్లో ఫేక్ కరెన్సీ చెలామణి చేస్తున్న నలుగురిని పోలీసులు వారం రోజు క్రితం అరెస్టు చేశారు. వారి నుంచి 756 నకిలీ 500 రూపాయలు అంటే మూడు లక్షల 78 వేలు రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్లని రిమాండ్‌కు తరలించారు. 

విచారణలో వేగం పెంచిన పోలీసులు శుక్రవారం సాయంత్రం అసలు సూత్రధారి అయిన కర్రీ మణికుమార్‌ను గుంటూరులో అరెస్టు చేశారు. అతని వద్ద 39,700 నకిలీ 500, 200, 100 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,02,80,000రూపాయలు.  వీటితోపాటు కంప్యూటర్, CPU, లామినేటర్, పెన్ డ్రైవ్లు,  స్కానర్లు, SBI  పేపర్ షీట్‌లు జప్తు చేశారు. 

వివిధ వ్యాపారాలు చేసిన నష్టపోయిన వీళ్లంతా టీంగా ఏర్పడి ఈ నకిలీ నోట్లు చెలామణికి యత్నించినట్టు పోలీసు విచారణలో తేలింది. ఇంకా ఈ ముఠాలు ఎవరెవరు ఉన్నారు ఇంకా మూలాలు ఏంటన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 
Also Read: వీర రాఘవ రెడ్డి చాలా మంచోడు! క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్న సొంతూరి ప్రజలు!

టాప్ హెడ్ లైన్స్

Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
Maharashtra Crime News: శ్రావణ మాసంలో మటన్ తినాలనుకున్నందుకు కొడుకును చంపిన తండ్రి! సాక్ష్యాలు ధ్వంసం చేసిన తల్లి!
శ్రావణ మాసంలో మటన్ తినాలనుకున్నందుకు కొడుకును చంపిన తండ్రి! సాక్ష్యాలు ధ్వంసం చేసిన తల్లి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
Vizag Crime News: విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం!
విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం!
Hyderabad E-Challan Fastag Link: హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్! ఫాస్టాగ్ నుంచే నేరుగా ఈ-చలాన్ కట్‌!
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్! ఫాస్టాగ్ నుంచే నేరుగా ఈ-చలాన్ కట్‌!
AP Local Body Elections: లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా?
లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా?
GDN Movie OTT : మాధవన్ GDN మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మాధవన్ GDN మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
DC Movie OTT : రెండు ఓటీటీల్లోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?
రెండు ఓటీటీల్లోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!
విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్
Embed widget