అన్వేషించండి

Crime News: ఆర్టీఐ చట్టమే వాళ్ల దందాలకు ఇంధనం- పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు

Crime News: ఆంధ్రప్రదేశ్‌లో రెండు సంచలన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని దందాలు చేస్తున్న ముఠా ఒకటి అయితే. నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ముఠా ఇంకొకటి.

Andhra Pradesh Crime News: ఆర్టీఐ పిటిషన్‌లు వేస్తూ బ్లాక్‌ మెయిల్ చేస్తున్న వ్యక్తులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడిని బెదిరించిన ఈ కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. ఆదోని మండలం బసాపురం వాసులు రఘునాథ్‌, ఆడివేష్‌ ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ దందాలు సాగిస్తున్నారు. వివిధ ఆసుపత్రులపై పిటిషన్లు వేయడం లోపాలు గుర్తించి వారి నుంచి డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారు. అదే మాదిరిగా ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి దమ్కీ ఇచ్చారు. రూ.50లక్షలు డిమాండ్‌ చేశారు. దీనిపై ఆ యాజమాన్యం పోలీసులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు వెళ్లే సరికి వారిపై కూడా నిందితులు తిరగబడ్డారు.  వెంటనే వారిని అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. 

ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు ఏపీ పోలీసులు. ఓ మెకానిక్ ఇచ్చిన సమాచారంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కోటి రూపాయలకుపైగా నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా పోలీసులు సీజ్ చేశారు. 

గుంటూరు కేంద్రంగా ఈ ముఠా నకిలీ నోట్లు ముద్రిస్తూ వస్తోంది. పదిహేను రోజుల క్రితం హరిబాబు అనే వ్యక్తి తన వ్యాన్‌ను రిపేర్ చేయాలని రాంబాబును కలిశాడు. రాంబాబు తన స్నేహితుడు ఆకుల పవన్‌తో కలిసి వ్యాన్‌ను చెక్ చేశారు. రిపేర్‌కు పదివేలు అవుతుందని చెప్పారు. వెంటనే జేబులో ఉన్న రెండు వేల రూపాయలను హరిబాబు వాళ్లకు ఇచ్చేశాడు. మిగిలిన డబ్బులు రిపేర్ పూర్తి అయిన తర్వాత ఇస్తానని చెప్పాడు. 

వ్యాన్ రిపేర్‌కు కావాల్సిన స్పేర్ పార్ట్‌లు కొనేందుకు షాప్‌ వద్దకు వెళ్లాడు రాంబాబు. పార్ట్స్‌ తీసుకొని డబ్బులు ఇచ్చాడు. అవి ఫేక్ నోట్స్‌ అని షాపువాళ్లు చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంటనే బిక్కవోలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

ఫిర్యాదు అందుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అనపర్తి, బిక్కవోలు, రంగంపేట పోలీసులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఇలా పలు ప్రాంతాల్లో ఫేక్ కరెన్సీ చెలామణి చేస్తున్న నలుగురిని పోలీసులు వారం రోజు క్రితం అరెస్టు చేశారు. వారి నుంచి 756 నకిలీ 500 రూపాయలు అంటే మూడు లక్షల 78 వేలు రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్లని రిమాండ్‌కు తరలించారు. 

విచారణలో వేగం పెంచిన పోలీసులు శుక్రవారం సాయంత్రం అసలు సూత్రధారి అయిన కర్రీ మణికుమార్‌ను గుంటూరులో అరెస్టు చేశారు. అతని వద్ద 39,700 నకిలీ 500, 200, 100 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,02,80,000రూపాయలు.  వీటితోపాటు కంప్యూటర్, CPU, లామినేటర్, పెన్ డ్రైవ్లు,  స్కానర్లు, SBI  పేపర్ షీట్‌లు జప్తు చేశారు. 

వివిధ వ్యాపారాలు చేసిన నష్టపోయిన వీళ్లంతా టీంగా ఏర్పడి ఈ నకిలీ నోట్లు చెలామణికి యత్నించినట్టు పోలీసు విచారణలో తేలింది. ఇంకా ఈ ముఠాలు ఎవరెవరు ఉన్నారు ఇంకా మూలాలు ఏంటన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 
Also Read: వీర రాఘవ రెడ్డి చాలా మంచోడు! క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్న సొంతూరి ప్రజలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు, 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్: చంద్రబాబు
అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు, 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్: చంద్రబాబు
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
TTD  News Guidelines: తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs MI Match Highlights IPL 2025 | ముంబై పై 12పరుగుల తేడాతో లక్నో ఘన విజయం | ABP DesamAngkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు, 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్: చంద్రబాబు
అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు, 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్: చంద్రబాబు
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
TTD  News Guidelines: తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
CSK Captain MS Dhoni:  చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
Embed widget