News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Kurnool జిల్లాలో నాటు బాంబుల కలకలం.. పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

గత కొంతకాలంగా కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు జరగడం తగ్గింది. కానీ గత వారం రోజులుగా పత్తికొండ పరిసర ప్రాంతాల్లో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి.

FOLLOW US: 
Share:

కర్నూలు జిల్లా అంటేనే ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. గత కొంతకాలంగా జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు జరగడం తగ్గింది. కానీ గత వారం రోజులుగా పత్తికొండ పరిసర ప్రాంతాల్లో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పత్తికొండ అటవీ ప్రాంతాల్లో వారం రోజుల క్రితం పొలాల్లో పని చేసుకుంటున్న మహిళలకు నాటు బాంబులు దొరికాయి అవి బాంబుల కాదా అని తెలుసుకునే ప్రయత్నం మహిళలు చేశారు. ఆ ప్రయత్నంలోనే ఒక మహిళ చేయి కోల్పోయింది.

గత వారం రోజులుగా ఫ్యాక్షన్ జోన్ మరియు  స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పత్తికొండ పరిసర ప్రాంతాలలో నాటు బాంబుల కోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి పత్తికొండ పట్టణంలోని ఎరుకల ఎల్లయ్య ఇంటిలో 26 నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఫ్యాక్షన్ జోన్ పోలీసులు. ఇంకా ఈ బాంబులు  తయారీలో సూత్రధారులు ఎవరెవరు ఉన్నారు, ఎందుకోసం తయారు చేశారో అనే కోణాల్లో నిందితులను విచారించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని పత్తికొండ పట్టణ సీఐ ఆదినారాయణ రెడ్డి అన్నారు.

పత్తికొండ ప్రాంతం గతంలో బాంబుల సంస్కృతి ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కానీ పత్తికొండ పరిసర ప్రాంతంలో ఒక్కసారిగా బాంబులు పేలడంతో మళ్లీ బాంబుల గోలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మహాబలేశ్వర్ గుప్తను అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే పత్తికొండ నడిబొడ్డున బాంబులతో దారుణంగా హత్యచేశారు.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన శేషి రెడ్డి ని బాంబు దాడుల్లోనే హత్య చేశారు. మరో ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి సైతం ఇదే తీరుగా దారుణహత్యకు గురయ్యారు. పత్తికొండ పట్టణంలో భారీ ఎత్తున బాంబులు దొరకడంతో ఇవి ఎవరిని అంతం చేయడానికి తయారు చేశారోనని రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు. వారం రోజుల కిందట పత్తికొండ పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న పొలాలలో పని చేసుకుంటున్న మహిళలకు నాటు బాంబులు పేలి ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పత్తికొండ పోలీసులు.

పత్తికొండ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పొలాలలో రైతులు రోజువారి మాదిరిగానే తమ పత్తి  పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒకచోట నిల్వ ఉంచిన బాంబులు కనిపించాయి వాటిని మహిళలు పరిశీలించగా నాటు బాంబులు లాగా ఉన్నాయని ఒకటి తీసుకుని బయటికి విసిరారు అది పేలకపోవడంతో ఈ బాంబులు కాదని నిర్ధారించుకున్న మహిళలు తమ పనులను యద విధిగా చేస్తుండగా అక్కడ నిల్వ ఉన్న బాంబులు ఒక్కసారిగా పేలడంతో ఆయాదుబి అనే మహిళకు అక్కడికక్కడే చేయి తెగిపోగా మరొక మహిళ తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో భయబ్రాంతులకు గురి అయిన పొలంలోని వ్యక్తులు దూరంగా పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గాయపడ్డ మహిళలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: BTech Student Suicide: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!

Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు

Also Read: Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Jan 2022 10:31 AM (IST) Tags: Crime News kurnool Kurnool District Kurnool Crime News Natu Bombs Pattikonda Natu Bombs In Pattikonda

ఇవి కూడా చూడండి

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

టాప్ స్టోరీస్

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
×