News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Konaseema News : ప్రేమించి మోసం చేసిన వ్యక్తిపై యువతి న్యాయపోరాటం, డీఎన్ఏ టెస్ట్ సస్పెన్స్!

Konaseema News : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేశాడో వ్యక్తి. తీరా బిడ్డ పుట్టాక నువ్వు ఎవరో తెలియదని ముఖం చాటేశాడు. తన బిడ్డకు న్యాయం చేయాలని బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.

FOLLOW US: 
Share:

Konaseema News : నిన్నే ప్రేమించానన్నాడు. నువ్వు లేకపోతే బతకలేన్నాడు. నీకోసం ఎవరినైనా ఎదిరిస్తానన్నాడు. పైగా మీ కుటుంబం మాకు బంధువులని నిన్ను ఎలా వదులుకుంటానని నమ్మబలికాడు. పెళ్లికాకుండానే తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. అన్నీ నమ్మేసిన ఆ యువతి మాయగాడి మాయమాటలకు లోబడిపోయింది. దీనికి ప్రతిఫలంగా పెళ్లికాకుండానే గర్భం దాల్చింది. చేతిలో చెయ్యేసి చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉంటాడన్న నమ్మకంతో పెళ్లికాకపోయినా తమ ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఆ గర్భాన్ని అలానే ఉంచుకుని నవమాసాలు మోసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన కలలన్నీ కలగానే మారిపోగా చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసిన ప్రియుడు పత్తాలేకుండా పోగా అసలు నువ్వెవరు అనే పరిస్థితికి వచ్చింది అతని నిజస్వరూపం. తనకు అన్యాయం చేయొద్దని ప్రాధేయపడ్డా అతని కఠిన హృదయం మారదని తెలిసి తనకు కాకపోయినా తన బిడ్డకు అయినా న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతని వల్లే బిడ్డ జన్మించిందని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకోసం పోలీసులు డీఎన్ఏ టెస్ట్ చేయించారని, అయితే తనకు పాప పుట్టి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు తన తండ్రి ఎవరో చెప్పుకొలేని స్థితిలో ఉన్నారని వాపోతోంది. 

ప్రేమించి మోసం 

కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాల తిప్పకు చెందిన వాతాడి వెంకటలక్ష్మి (22) మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన పెసంగి నరసింహారావు ప్రేమించుకున్నారు. వెంకటలక్ష్మి అక్క అత్తవారి ఇళ్లు గోగన్నమఠంలో కాగా అక్కను చూసేందుకు వెళ్లి వెంకటలక్ష్మిని ప్రేమించానని నరసింహారావు వెంటపడేవాడని, ఈ క్రమంలోనే 2021లో అతను చెప్పిన మాయమాటలు నమ్మి శారీరకంగా ఒక్కటయ్యామని బాధితురాలు చెబుతోంది. నాలుగు నెలల తరువాత తాను గర్భవతినని చెప్పానని, అయితే అప్పటివరకు ఎంతో నమ్మకంగా ఉన్న అతను తనను వదిలించుకునేందుకు ప్రయత్నించాడని తెలిపింది. తాను అప్పటికే నాలుగో నెల గర్భవతినని, ఆ తరువాత పది నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చానని చెబుతోంది. 2021లో పెసంగి నరసింహారావుపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని, అయితే గత నెల 28వ తేదీన విజయవాడలో తనకు, తన పాపకు, నరసింహారావుకు డీఎన్ఏ టెస్ట్ కోసం రక్త నమూనాలను తీసుకున్నారని చెప్పింది. నెల రోజులు గడచిపోయినా ఇంతవరకు తనకు ఎటువంటి సమాచారం రాలేదని, తన బిడ్డకు తండ్రి ఎవ్వరో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నానని వాపోతోంది. పోలీసుల వద్దకు వెళ్లి అడిగితే ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారని తెలిపింది. మరో పక్క తన అక్క అత్తగారి ఇంటి వద్ద మోసం చేసిన నరసింహారావు తండ్రి, కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయని, ఇవన్నీ భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతోంది.

బాధితురాలికి న్యాయం చేసేలా ప్రయత్నించాం : ఎస్సై

నమ్మించి మోసం చేసిన పెసంగి నరసింహారావు, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని, ఈ కేసులో కోర్టు రిమాండ్ కూడా విధించిందని ఉప్పలగుప్తం ఎస్సై జి. వెంకటేశ్వరరావు తెలిపారు. అంతకు ముందు బాధిత యువతికి న్యాయం చేసేందుకు నిందితునికి పలుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందని, అయితే అతనిలో ఎటువంటి మార్పు కనిపించడంలేదన్నారు. విజయవాడలో ముగ్గురికి డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించామని అయితే దానికి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపారు. బాధిత యువతికి పూర్తిగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అయితే కొంత సమయం పడుతుందని ఎస్సై వెల్లడించారు. బాధిత యువతికి కానీ, ఆమె అక్కకు కానీ ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని భరోసా ఇచ్చారు. 

Published at : 28 Apr 2022 08:45 PM (IST) Tags: AP News Crime News Konaseema news person cheated woman DNA Test

ఇవి కూడా చూడండి

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన

UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం

Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

టాప్ స్టోరీస్

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni YSRCP :  మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా  - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్‌తో వచ్చిన నాగార్జున

Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్‌తో వచ్చిన నాగార్జున

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా