News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Viveka Murder Case : పది రోజుల్లో వీడిపోనున్న వివేకా మర్డర్ కేసు మిస్టరీ..!?

వైఎస్ వివేకా హత్య కేసు మర్డర్ మిస్టరీని చేధించేందుకు సీబీఐ ముందడుగు వేసింది. నిందితుడు సునీల్ యాదవ్‌ను కస్టడీలోకి తీసుకుంది.

FOLLOW US: 
Share:


వైఎస్ వివేకానందరెడ్డి కేసు మిస్టరీ వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ  ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ పది రోజుల కస్టడీకి తీసుకుంది. అంతకు ముందే ఆయనను దాదాపుగా నెల రోజుల పాటు ప్రశ్నించింది. కానీ అప్పట్లో ఆయన పూర్తి వివరాలు చెప్పలేదు. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు లభించడంతో కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టాలని నిర్ణయించుకున్నారు. గోవాలో అరెస్ట్ చేసి పులివెందులకు సునీల్ యాదవ్‌ను సీబీఐ తీసుకు వచ్చింది. కోర్టులో హాజరు పరిచింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు. కస్టడకి ఇవ్వడంతో ఇవాళ కడపజైలు నుంచి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న  అతిథిగృహానికి తరలించారు.  వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ప్రమేయంపై చాలా అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే రంగన్న వాంగ్మూలంలో కూడా సునీల్ పేరు ప్రస్తావించడంతో.. అతనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సీబీఐ కోర్టులో వాదించింది. 

సునీల్ యాదవ్ కుటుంబం మొత్తం వైఎస్ వివేకాకు సన్నిహితులు. వారితో అత్యంత చనువుగా ఉంటున్నఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివేకా హత్య కేసు వెనుక మిస్టరీ సునీల్‌కు తెలిసే ఉంటుందని.. లేకపోతే.. ఆ కుట్రలో భాగమై ఉంటారని సీబీఐ అధికారులు నమ్ముతున్నారు. ఈ కేసు కోసం ఇప్పటికే రెండు నెలలుగా సీబీఐ అధికారులు పులివెందులలోనే మకాం వేశారు. కేసును చేధించి వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. సాక్ష్యాలు మాయం చేసిన వారిని... మాయం చేయడానికి ప్రయత్నించిన వారిని సీబీఐ అధికారులు ఇంత వరకూ ప్రశ్నించలేదు. సునీల్ యాదవ్‌ కస్టడీలో చెప్పే విషయాలను బట్టి సీబీఐ.. వారిపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి వివేకా కేసు దర్యాప్తు మాత్రం కీలక దశకు చేరుకుందని సీబీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

సీబీఐ అధికారులు పులివెందులలో దాదాపుగా ప్రతీ రోజు మాజీ డ్రైవర్ దస్తగిరిని... వివేకా సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డిని పిలిచి ప్రశ్నించారు.  అప్పుడప్పుడూ.. వివేకా ఇంటిని పరిశీలిస్తున్నారు.  వైఎస్ సునీత ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పదిహేను మంది ప్రధాన నిందితులు అందర్ని సీబీఐ ప్రశ్నించలేదు. మధ్యలో విచారణ అధికారిని మార్చడం కూడా వివాదాస్పమయింది. చివరికి సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ప్రమేయంపై సాక్ష్యాలు గుర్తించి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. దీంతో ప్రజల్లోనూ ఈ కేసు మిస్టరీ వీడిపోతుందన్న అభిప్రాయం వైఎస్ కుటుంబ సభ్యుల్లోనూ కనిపిస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె సునీత.. సీబీఐ అధికారులకు ఎలాంటి సమాచారం కావాలన్నా తక్షణం అందిస్తున్నారు. 

Published at : 07 Aug 2021 03:33 PM (IST) Tags: cbi murder YS Viveka pulivendula ranganna sunil yadav gangireddy

ఇవి కూడా చూడండి

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

టాప్ స్టోరీస్

Women MLAs In Telangana: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కారు పంక్చర్‌- పదికి చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య

Women MLAs In Telangana: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కారు పంక్చర్‌- పదికి చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య

Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే! టచ్ లోకి మరో నలుగురు!

Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే! టచ్ లోకి మరో నలుగురు!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
×