అన్వేషించండి

Kerala Woman Dies: ప్రాణాలు తీసిన బిర్యానీ, కేరళలో ఓ యువతి మృతి - ఫుడ్ పాయిజన్ అయిందా?

Kerala Woman Dies: కేరళలో ఓ యువతి బిర్యానీ తిని ప్రాణాలు కోల్పోయింది.

Kerala Woman Dies Eating Biryani:

ఫుడ్ పాయిజన్..? 

కేరళలో ఓ 20 ఏళ్ల యువతి బిర్యానీ తిని ప్రాణాలు కోల్పోయింది. కేరళలో ఫేమస్ వంటకం అయిన "కుజిమంతి" బిర్యానీని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న యువతి...అది తిన్న వెంటనే అనారోగ్యానికి గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...అంజు శ్రీపార్వతి అనే యువతి కసరగాడ్‌లో ఉంటోంది. గతేడాది డిసెంబర్ 31న ఆన్‌లైన్‌లో ఓ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుంది. అది తిన్నాక అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న యువతి..చివరకు మృతి చెందింది.  "తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ ఉదయం బాధితురాలు చనిపోయింది" అని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మొదట వైద్యం అందించారు. అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడే బాధితురాలు చనిపోయింది.

విచారణ..

ఈ ఘటనపై కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ స్పందించారు. విచారణకు ఆదేశించారు. "ఫుడ్‌ సేఫ్‌టీ కమిషనర్‌కు ఆదేశాలిచ్చాం. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని చెప్పాం. డీఎమ్‌ఓ కూడా విచారణ జరుపుతున్నారు" అని ఆమె వెల్లడించారు. ఫుడ్ పాయిజన్‌ అని తేలితే అలాంటి హోటల్స్‌ లైసెన్స్‌లు రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత వారం కొట్టాయం మెడికల్ కాలేజ్‌కు చెందిన ఓ నర్స్ కొజికోడ్‌లో ఓ హోటల్‌లో ఫుడ్ తిని మృతి చెందింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. చాలా హోటల్స్‌లో ప్రమాణాలు పాటించడం లేదని గతంలోనే పలు నివేదికలు వెల్లడించాయి. వాడిన నూనె మళ్లీ వాడటం, మాంసాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచడం లాంటి అజాగ్రత్తలతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 

తరచూ ఘటనలు..

గతేడాది డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పెళ్లి భోజనం తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి పూర్తికాగానే భోజనం చేసి అతిథులంతా వెళ్లిపోయారు. కాసేపటి తరవాత అందరికీ వాంతులు అయ్యాయి. తీవ్ర కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. సాయంత్రానికి అందరూ మంచం పట్టారు. దగ్గర్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. "ఓ ఆలయంలో జరిగిన పెళ్లికి అందరూ హాజరయ్యారు. అక్కడ వివాహ విందు చేసిన తరవాత  అందరికీ వాంతులయ్యాయి. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు" అని వైద్యులు తెలిపారు. ఇటీవలే బిహార్‌లోనూ ఓ దారుణం జరిగింది. బల్లి పడినట్లు అనుమానిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బలవంతంగా తినిపించడంతో 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. భాగల్పుర్‌లోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ట్యూషన్‌ క్లాసులకు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. కొద్దిసేపటికే మిగిలిన విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పాఠశాల సమీపంలోని ఓ వైద్య కేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. 

Also Read: Oreo Biscuits: యూఏఈలో ఓరియో బిస్కెట్‌లపై వివాదం, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Alert for single Men: అమ్మాయిలు, ఆంటీలతో రసిక చాట్ అంటే కక్కుర్తి పడకండి - ఈ కొత్త మోసం గురించి తెలుసుకోండి !
అమ్మాయిలు, ఆంటీలతో రసిక చాట్ అంటే కక్కుర్తి పడకండి - ఈ కొత్త మోసం గురించి తెలుసుకోండి !
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Embed widget