By: Ram Manohar | Updated at : 06 Jan 2023 11:43 AM (IST)
కంజావాలా కేసులో కార్ ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Kanjhawala Case:
కార్ ఓనర్ అరెస్ట్..
కంజావాలా కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసుతో ఐదుగురి నిందితులతో పాటు మరి కొందరికీ సంబంధం ఉందని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. అయితే...ఇప్పుడు ఆరో వ్యక్తిని పట్టుకున్నారు. కార్ ఓనర్ అశుతోష్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం ఐదుగురు నిందితులనూ ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో చిక్కు ముడులున్నాయి. అంజలి కార్ కింద చిక్కుకుందని తెలిసినా పట్టించుకోకుండా లాక్కెళ్లారని తన స్నేహితురాలు నిధి చెప్పింది. అయితే... ఈమె మాటల్లోనూ నిజమెంత అన్నది స్పష్టత రావడం లేదు. నిధి తల్లి కూడా అంజలిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. "కావాలనే వాళ్లు అంజలిపైకి కార్ ఎక్కించారని నా కూతురు చెప్పింది" అని నిధి తల్లి వెల్లడించారు. ఇది కచ్చితంగా హత్యేనని అంటున్నారు. తన కూతురునీ చంపేందుకు వాళ్లు ప్రయత్నించారని...అదృష్టవశాత్తు తప్పించుకుని వచ్చిందని అన్నారు. అయితే..పోలీసులు మాత్రం ఇది హత్య అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. కార్లో ఉన్న ఐదుగురితో పాటు మరో ఇద్దరికీ ఈ కేసుతో సంబంధం ఉందని చెప్పారు. ఇప్పుడా ఆరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంజలి ఫ్రెండ్ నిధిని కీలక సాక్ష్యంగా భావిస్తున్నారు. కార్ ఓనర్ అశుతోష్..ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోయినా..నిందితులకు సహకరించాడని పోలీసులు స్పష్టం చేశారు. మరో నిందితుడు అంకుశ్ ఖన్నా కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. "వీళ్లిద్దరూ కార్లో ఉన్న ఐదుగురుని శిక్ష పడకుండా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని తెలిపారు. అశుతోష్కు కార్ ప్రమాదం గురించి తెలిసినా...తమకు చెప్పలేదని అన్నారు.
ఎన్నో అనుమానాలు..
ఇంకా కొన్ని విషయాల్లో స్పష్టత రావడం లేదు. అందుకే...పోలీసులు ఆ నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడి నుంచి ఎందుకు పరారయ్యారు..? ఇది కావాలనే చేశారా..? అనే నిజా నిజాలు బయటకు రావాలంటే..ఈ టెస్ట్ తప్పదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే...యాక్సిడెంట్ చేశాక కూడా అసలేమీ జరగనట్టుగా తిరిగారు నిందితులు. అంతే కాదు. కార్ ఓనర్కు ఆ కార్ని తిరిగి ఇవ్వలేదు కూడా. "అంత రాత్రి పూట నిద్ర లేపి కార్ ఇవ్వడం ఎందుకని ఆగిపోయాం" అని నిందితులు విచారణలో చెప్పినప్పటికీ పోలీసుల అనుమానం తీరలేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...సీసీటీవీ ఫుటేజ్ మిస్ మ్యాచ్ అవుతోంది. నిధి ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రకారం చూస్తే...ఆమె తన ఇంటికి తిరిగి వచ్చిన టైమ్ 1.36 AM. కానీ... పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే...ఆ సీసీటీవీ DVR 45-50 నిముషాలు లేట్గా నడుస్తోందని. ఇక నిధి, అంజలి హోటల్ నుంచి బయటకు వచ్చిన టైమ్ని సీసీటీవీలో చూస్తే 1.32AM. కానీ...ఇక్కడ కూడా CCTV 15 నిముషాలు ఆలస్యంగా నడుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఫలితంగా..ఈ "టైమింగ్స్" మిస్మ్యాచ్ అవుతున్నాయి.
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్
Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, కూలీలపై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి!
Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?
Guntur Crime : గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు- కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, 50 గొర్రెలు చోరీ
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి