అన్వేషించండి

Jaipur - Mumbai Train Firing: ఇండియాలో ఉండాలంటే మోదీ, యోగీకి ఓటు వేయాల్సిందే- ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీడియో వైరల్ !

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైలులో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ చేతన్ సింగ్ చేతిలో ఆర్పీఎఫ్‌ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ తికారాం మీనాతో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
ఆ వీడియోలో.. కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన చేతిలో తుపాకీతో ప్రయాణికులను బెదిరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక ప్రయాణికుడి మృతదేహం కూడా అతని పాదాల దగ్గర రక్తపు మడుగులో పడి ఉంది. తాను హత్య చేసిన వ్యక్తులకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని సింగ్ చెప్పినట్లు వినిపిస్తోంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీడియా కూడా అదే చెబుతుందని, ఎవరైనా జీవించాలనుకునే వారు ‘మోదీ, యోగి’లకు మాత్రమే ఓటు వేయాలని బెదిరింపులకు దిగాడు.

డ్యూటీ నుంచి రిలీవ్ చేయలేదని..
ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) కమిషనర్ రవీంద్ర షిస్వే వివరాల మేరకు.. చేతన్‌ సింగ్‌ను ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) సిబ్బంది పట్టుకున్నారు. మరణించిన ప్రయాణికులను అబ్దుల్ ఖాదిర్‌భాయ్ మహమ్మద్ హుస్సేన్ భన్‌పూర్వాలా (48), అక్తర్ అబ్బాస్ అలీ (48), సదర్ మహ్మద్ హుస్సేన్‌లుగా గుర్తించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఎస్కార్ట్ పార్టీలో భాగమైన ప్రయాణికులు, RPF సిబ్బంది, ప్యాంట్రీ కారు సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. FIR వివరాల ప్రకారం.. నిందితుడు కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన షిఫ్ట్ ముగియడానికి కొన్ని గంటల ముందు డ్యూటీ నుంచి రిలీవ్ కావాలని కోరాడు. కానీ అతని సీనియర్లు డ్యూటీ పూర్తి చేయాలని సూచించడంతో అతనికి ఆవేశం వచ్చింది. దీంతో తన సీనియర్ అధికారి మీనాతో పాటు రైలులో మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. 

సీనియర్లు చెబుతున్నా వినకుండా
మరో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అమయ్ ఆచార్య బోరివలి వివరాల మేరకు ‘సోమవారం తెల్లవారుజామున సింగ్, మీనా, మరో ముగ్గురు టిక్కెట్ చెక్కర్లు ప్యాంట్రీ కోచ్‌లో నన్ను కలిశారు. సింగ్ అస్వస్థతతో ఉన్నాడని మీనా తనకు చెప్పారని, ఆ తర్వాత తాను చేతన్ సింగ్ చేతిని పరీక్షిస్తే  జ్వరం ఉందో లేదో నేను అంచనా వేయలేకపోయానని చెప్పారు. ఈ నేపథ్యంలో చేతన్ సింగ్ డ్యూటీ నుంచి త్వరగా రిలీవ్ కావాలని, వల్సాద్ రైల్వే స్టేషన్‌లో దింపాలని సింగ్ పట్టుబట్టాడు. అయితే రెండు మూడు గంటల్లో ముంబై చేరుకుంటామని మీనా అతనికి వివరించేందుకు ప్రయత్నించారు. సింగ్ అందుకు అంగీకరించకపోవడంతో మీనా ముంబై సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కి తెలియశారు. అతన్ని ఒప్పించమని కోరింది. అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సుజిత్ కుమార్‌ సైతం నచ్చచెప్పే ప్రయత్నం చేసినా సింగ్ వినడానికి సిద్ధంగా లేడు. కూల్ డ్రింక్ తాగమని, కొంత సమయం విశ్రాంతి తీసుకోమని సింగ్‌కు మీనా సూచించారు. 

మరుగుదొడ్లో దాక్కున్న కానిస్టేబుల్
విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సింగ్ అకస్మాత్తుగా లేచి ఆచార్య రైఫిల్‌ను బలవంతంగా తీసుకున్నాడు. అడ్డుకున్న ఆచార్యను గొంతు కోసి చంపడానికి కూడా ప్రయత్నించాడు. కొద్ది సేపటికి  రైఫిల్‌ని తిరిగి ఇచ్చాడు. ఆ సమయంలో సింగ్ చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు కూడా మీనా అతనికి వివరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆచార్య సైతం అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించినా వారి మాట వినలేదు. దీంతో ఆచార్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో చేతన్ తన రైఫిల్ సేఫ్టీ క్యాచ్‌ను తొలగిస్తున్నట్లు గమనించాడు. వెంటనే మీనాకు సమాచారం ఇచ్చాడు. అయితే తెల్లవారుజామున 5 గంటలకు ఆచార్యకు అతని బ్యాచ్‌మేట్ నుంచి కాల్ వచ్చింది. మీనాను చేతన్ సింగ్ కాల్చాడని చెప్పాడు. దీంతో తనను చంపేస్తాడనే భయంతో ఆచార్య వాష్‌రూమ్‌లో దాక్కున్నాడు. 

ఇక ఘటనలో చనిపోయిన మీనాకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు పశ్చిమ రైల్వే సీనియర్ అధికారి తెలిపారు. తక్షణం  అంత్యక్రియల ఖర్చు రూ. 20,000 అందిస్తామని, రైల్వే సురక్ష కళ్యాణ్ నిధి నుంచి అదనంగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget