అన్వేషించండి

Hyderabad Woman Suicide: 15 రోజుల కవల పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య - ఆ భయాన్ని జయించక పోవడమే కారణమా !

Hyderabad Woman Suicide: మేనరికపు వివాహం కారణంగా తమకు పుట్టిన కవల పిల్లలు చనిపోతారన్న భయంతో.. 15 రోజుల శిశువులను నీటి సంపులో పడేసి ఆపై మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. 

Hyderabad Woman Suicide: సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మేనరికపు వివాహం కారణంగా తమకు పుట్టిన పిల్లలు చనిపోతారని భయంతో.. ఓ తల్లి తన ఇద్దరు కవలలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా పదిహేను రోజుల వయసు మాత్రమే ఉన్న ఇద్దరు శిశువులను నీటి సంపులో పడేసి ఆపై తాను కూడా అదే సంపులో దూకి బలవన్మరణం చేందింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Hyderabad Woman Suicide: 15 రోజుల కవల పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య - ఆ భయాన్ని జయించక పోవడమే కారణమా !

అసలేం జరిగిందంటే...?

సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంధ్యా రాణి అనే వివాహిత గతంలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చినిచ్చింది. పుట్టిన కొన్నాళ్లకే ఇద్దరు పిల్లలు మృతి చెందారు. దీంతో సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే సంధ్యా రాణి మరోసారి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తనది మేనరికం పెళ్లి కావడం.. గతంలో ఇద్దరు పిల్లలు అందుకే చనిపోయారని భావించిన ఈమె.. ఈసారి పుట్టిన కవల పిల్లలు కూడా చనిపోతారేమోనని భావించింది. ఆ ఊహనే తట్టుకోలేకపోయింది. అలా చనిపోవడం కంటే పిల్లలు లేకుండా తాను బతకలేనని భావించి వారితో పాటే తాను ప్రాణాలను తీసుకోవాలనుకుంది. వెంటనే నీటి సంపును తెరిచి పిల్లలిద్దరినీ అందులో పడేసింది. ఆపై తాను కూడా అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

నీటిసంపులో చిన్నారులతో సహా సంధ్యారాణి మృతదేహం

నీటి సంపు మూత తెరిచి ఉండడం, సంధ్యా రాణితో పాటు పిల్లలు కనిపించకపోవడంతో.. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. సంపులో చూసే సరికి ముగ్గురి మృతదేహాలు ఉన్నాయి. ఓ వైపు గట్టిగా ఏడుస్తూనే మరోవైపు స్థానికులను పిలిచారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కవల శిశువులతో పాటు సంధ్యారాణి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే పిల్లలు పుట్టి ఆనందంలో ఉన్న కుటుంబ సభ్యులకు ముగ్గురి మృతిని చూసి తట్టుకోలేక పోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇటీవల నిర్మల్ లో పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య

ఏ కష్టం వచ్చిందో ఓ వివాహిత తన పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా బాసర గోదావరి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన మానస(27) తన పిల్లలు ఐన కొడుకు బలాదిత్య(8) భవ్యశ్రీ (7) తో కలిసి బాసర గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గోదావరిలో నుండి మృతదేహాలను బయటకు తీసి పంచనామ నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద బందువుల రోదనలు అక్కడ ఉన్నవారి హృదయాలను కలచి వేశాయి. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget