అన్వేషించండి

Santosh Nagar Gang Rape: ఆ గ్యాంగ్ రేప్ ఉత్తిదే.. తేల్చేసిన పోలీసులు, ఆ యువతి మాస్టర్ ప్లాన్ ఎందుకంటే..

తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ యువతి బుధవారం (ఆగస్టు 19) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయగానే రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు నాటకమని పోలీసులు తేల్చేశారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు తనను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కేసు పెద్ద హై డ్రామా అని పోలీసులు ధ్రువీకరించారు. తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేయగానే రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో ఈ కేసులో కిడ్నాప్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకనట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో అతణ్ని ఈ కేసులో ఇరికించేందుకు యువతి ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు.

గంట లేట్‌గా ఇంటికి.. 
ఆమె చెప్పే విషయాలకు పొంతన లేకపోవడంతో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. సీసీటీవీ కెమెరాల్లో ఆధారాలు దొరక్కపోవడం, ఆమె చెప్పిన మాటలకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతేకాక, ఘటన జరిగిందని యువతి చెప్పిన ప్రదేశానికి కారులో వెళ్లి వచ్చేందుకే పోలీసులకు సుమారు 3 గంటల సమయం పట్టింది. అయితే రాత్రి 9.30కి ఇంటికి రావాల్సిన యువతి 10.30కి ఇంటికి చేరుకోవడంతో ఆమె తప్పుడు ఫిర్యాదు చేసిందని పోలీసులు భావిస్తున్నారు. యువతిపై రేప్ జరగలేదని వైద్య పరీక్షల్లో కూడా తేలినట్లు తెలుస్తోంది.

Also Read: Hyderabad Theft: అమ్మమ్మతో కలిసి యువకుడు దొంగతనాలు.. వీళ్లు ఆడే నాటకాలకి షాక్‌లో బాధితులు

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి గ్యాంగ్ రేప్ జరిగిందనే వార్త కలకలం రేపింది. బాధితురాలైన యువతి పట్టపగలే తనను కిడ్నాప్ చేసి ఆటో డ్రైవర్లు, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ ఘటన పహాడి షరీఫ్ ప్రాంతంలో జరిగిందని పోలీసులకు చెప్పింది. 20 ఏళ్ల వయసున్న తనను సంతోష్ నగర్‌లో ఆటోలో కిడ్నాప్ చేసి పహాడీ షరీఫ్‌లో అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టారు. ముందుగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఏ ఆధారమూ దొరక్కపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు యువతిని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటికి వచ్చింది.

కట్టుకథ ఇలా..
యువతి తాను ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నానని చెప్పింది. ఫిర్యాదు చేసే సందర్భంలో కట్టుకథ అల్లింది. సంతోష్ నగర్‌లో తాను ఆటో ఎక్కానని, పహాడీ షరీఫ్ తీసుకువెళ్లిన తరువాత డ్రైవర్ మరో యువకుడిని ఆటోలో ఎక్కించుకున్నాడని చెప్పింది. ఆటో వెళ్తుండగా.. ఆ యువకుడు తనను అరవకుండా నోరు మూశాడని.. ఆటో డ్రైవర్ ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. అక్కడ తనపై సామూహిక అత్యాచారం చేశారని చెప్పింది. తనను అక్కడే వదిలేసి అందరూ పరారయ్యారని పేర్కొంది.

Also Read: Vijayashanthi: ఒవైసీ గారూ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి.. విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
YS Sharmila : YSR, విజయమ్మను  బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ?  జగన్‌పై షర్మిల సెటైర్లు
YSR, విజయమ్మను బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ? జగన్‌పై షర్మిల సెటైర్లు
TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
Fact Check: భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP candidate Pemmasani Chandrasekhar Assets value | దేశంలోనే ధనిక అభ్యర్థి మన తెలుగోడే అని తెలుసా.!Madhavi Latha Nomination Ryally |భాగ్యలక్ష్మీ టెంపుల్ లో పూజలు...నామినేషన్ వేసిన మాధవి లత | ABPPawan kalyan Kakinada | కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ నామినేషన్ ర్యాలీలో అలసిపోయిన పవన్ కళ్యాణ్ | ABPNara Rohit Prathinidhi 2 Interview | డైరెక్టర్ గా మారిన మూర్తితో జర్నలిస్ట్ నారా రోహిత్ ఇంటర్వ్యూ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
YS Sharmila : YSR, విజయమ్మను  బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ?  జగన్‌పై షర్మిల సెటైర్లు
YSR, విజయమ్మను బూతులు తిట్టిన బొత్స తండ్రి సమానులా ? జగన్‌పై షర్మిల సెటైర్లు
TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల- ములుగు జిల్లా టాప్, కామారెడ్డి లాస్ట్
Fact Check: భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
భారత్ పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే 25 కోట్ల ముస్లింలు పాక్ ఆర్మీలో చేరతారని అసదుద్దీన్ అన్నారా? నిజం ఏంటంటే
Bandi Sanjay :  అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది -  కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు
అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది - కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు
Nara Rohit: ఏపీ రాజకీయాలపై నారా రోహిత్‌ హాట్‌ కామెంట్స్‌ - 'ప్రతినిధి 2' వాయిదాపై ఏమన్నాడంటే!
ఏపీ రాజకీయాలపై నారా రోహిత్‌ హాట్‌ కామెంట్స్‌ - 'ప్రతినిధి 2' వాయిదాపై ఏమన్నాడంటే!
సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు
సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు
YS Jagan Stone Pelting Cace :  జగన్‌పై రాయి  దాడి కేసు నిందితునికి మూడు రోజుల కస్టడీ - థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న  కోర్టు
జగన్‌పై రాయి దాడి కేసు నిందితునికి మూడు రోజుల కస్టడీ - థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న కోర్టు
Embed widget