అన్వేషించండి

Seizure of Ganja: మేడ్చల్ జిల్లాలో గంజాయి ముఠా గుట్టురట్టు, రూ.33లక్షల మాల్ స్వాధీనం

Ganja in Medchal: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముఠా ను రాజేంద్ర నగర్ ఎస్ ఓ టీ, దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు 33లక్షలు ఉంటుందని తెలిపారు.

Seizure of Marijuana in Medchal District : నిత్యం ఎక్కడో ఒక చోట తరచూ గంజాయి పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సరఫరా అవుతున్నాయి. ఎక్సైజ్‌, పోలీసు అధికారులు కిలోల కొద్దీ గంజాయిని పట్టుకుంటున్నా గంజాయిని సరఫరా ఆగడం లేదు. మరోవైపు గ్రామీణ యువత, విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యానికి గురవుతామని తెలిసి కూడా గంజాయిని వదలడం లేదు.  తాజాగా దుండిగల్  పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠా ను రాజేంద్ర నగర్ ఎస్ ఓ టీ, దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి ఢిల్లీకి వయా హైదారాబాద్ మీదుగా హోండా సిటీ కార్ లో తరలిస్తున్నారన్న సమాచారం తో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 86కేజీల గంజాయి తో పాటు ఒక కారు, 2సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

ముగ్గురు నిందితులు పరార్
ఐదుగురు నిందితుల్లో ట్రాన్స్ పోర్టు చేస్తున్న  ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారుజ అరెస్ట్ అయిన వారిలో ఒడిశాకు చెందిన సునీంద్ర కుమార్ సింగ్  పాత నేరస్తుడు కాగా  లక్ష్మి అనే మహిళ కూడా ముఠాలో ఉంది. కారుతో పాటు పట్టుకున్న గంజాయి విలువ సుమారు 33లక్షలు ఉంటుందని తెలిపారు. పెట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ ఎస్ ఓ టీ, దుండిగల్ పోలీసులు ముఠాను పట్టుకున్నారు.

భద్రాచలంలో 45కేజీల గంజాయి స్వాధీనం
రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు కారులో 45.170 కిలోల గంజాయిని తరలిస్తుండగా ముఖేష్ మిర్దా, గుజ్జర్ శ్రీరామ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.  

దేవరపల్లిలో 64కిలోల గంజాయి స్వాధీనం
దేవరపల్లి మండలం రైవాడ పంచాయతీ శివారు శ్రీరాంపురం గ్రామంలో గురువారం రాత్రి పోలీసుల దాడిలో 64 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై టి.మల్లేశ్వరరావు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంత్రం శ్రీరాంపురం జంక్షన్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కారులో ఐదుగురు యువకులు కనిపించారు. కారులో గంజాయి లభ్యమైంది. దాడి సమయంలో ఇద్దరు తప్పించుకోగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కారులో 32 గంజాయి ప్యాకింగ్‌లు ఉన్నాయని, ఒక్కో ప్యాకెట్‌ రెండు కేజీలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఒడిశా రాష్ట్రం జామిగూడ గ్రామం నుంచి తీసుకువస్తున్నామని నిందితులు తెలిపారు. అరెస్టయిన నిందితులు రంజు వీర (28), అర్జున్(30) అనే ఇద్దరు వ్యక్తులు మల్కన్‌గిరి జిల్లా జమ్మిగూడ మండలం పనసపుట్టు గ్రామానికి చెందినవారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి చోడవరం కోర్టుకు తరలించినట్లు ఎస్సై మల్లేశ్వరరావు విలేకరులకు తెలిపారు.

 

Read Also : Kuppam News: కుప్పంలో గంజాయి కలకలం! కర్రలు, రాడ్లతో కొట్టుకున్న యువకులు!  

Read Also : Ganja Seize: 'పుష్ప' సినిమానే మించిపోయారు - ఏకంగా అంబులెన్సులోనే గంజాయి తరలింపు

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Wife Kills Husband With Snake: చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget