News
News
X

Hyderabad: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ, పీఎస్ కు దగ్గర్లోనే మృతదేహం!

Hyderabad: వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిందో మహా ఇల్లాలు. అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కు సమీపంలో పడేసి ప్రియుడితో పారిపోయింది.

FOLLOW US: 
Share:

Hyderabad: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిందో భార్య. అనంతరం పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో మృతదేహాన్ని పడేసి పారిపోయింది. తాజాగా ఈ ఘటన  సంచలనం రేపుతోంది. 

లంగర్ హౌస్ కి చెందిన షేక్ ఫరీద్.. తన భార్యతో కలిసి జవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తరచుగా అతడిని కలుస్తూ.. వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ విషయం భర్త ఫరీద్ కు తెలిసింది. దీంతో భార్యని మందలించాడు. పరువు పోతుందని ఈ పని మానుకొమ్మని సూచించాడు. అప్పటి నుంచి ప్రియుడిని కలవనీయకుండా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను తొలగించుకోవాలనుకుంది. ప్రియుడికి ఫోన్ చేసి విషయం గురించి తెలిపింది. ఇద్దరూ కలిసి ఫరీద్ ను చంపేందుకు పథకం వేశారు. అనుకున్నట్లుగానే అతడిని చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని లంగర్ హౌస్ లోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో పడేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. 

అయితే పోలీస్ స్టేషన్ కు దగ్గర్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు అయిన ఫరీద్ భార్యను, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

తాజాగా కామారెడ్డిలోనూ ఇలాంటి ఘటనే..!

తాజాగా కామారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిందో భార్య.. రుద్రూర్ లో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రుద్రూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టి వయస్సు 40 కి ధర్మాబాద్ బాలాపూర్ కు చెందిన సావిత్రితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవించే వారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ పనులు చేసే జెఎస్సీ కాలనీకి చెందిన బట్టు శ్రీనివాస్ తో సావిత్రికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం ఇటీవల సావిత్రి భర్త పోశెట్టికి తెలియడంతో భార్యతో ఘర్షణ పడ్డాడు. చెడు అలవాట్లు మానుకోవాలని సావిత్రికి చెప్పాడు. సావిత్రి బుద్ధి మార్చుకోనందున తరుచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సావిత్రి తల్లి చంద్రభాగ ఇటీవల రుద్రూర్ వచ్చింది. కూతురుతో తరుచూ గొడవ పడుతున్న పోశెట్టిని తప్పించాలని తల్లి కూతుళ్లు శ్రీనివాస్ ను ప్రేరేపించారు. దీంతో ఈ నెల 2న పోశెట్టిని ఇంటి నుంచి శ్రీనివాస్ బైక్ పై  తీసుకుని వెళ్లాడు. కల్లు దుకాణంలో కల్లు తాగించాడు.

ఎట్టకేలకు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు..

అనంతరం మద్యం షాపులో మందు తీసుకొని నక్కల ఒర్రెకు వెళ్లారు. అక్కడ పోశెట్టికి పూటుగా మద్యం తాగించి చెరువు బ్యాక్ వాటర్ ఒర్రెలోకి తోసేశాడు. చనిపోయాడని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లి సావిత్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం సావిత్రి ఏమి తెలియనట్లు నటించింది. రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తే సమాధానం దాటవేసింది. చివరకు పోలీస్ స్టేషన్ లో తన భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై రవీందర్ దర్యాప్తు చేయగా శ్రీనివాస్ సావిత్రికి ఉన్న సంబంధం బయట పడింది. శ్రీనివాస్ ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటనా స్థలికి రుద్రూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రవీందర్ వెళ్లి మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీయించారు. మృతుడి భార్య సావిత్రి, అత్త చంద్రబాగ, శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.

Published at : 12 Sep 2022 05:56 PM (IST) Tags: Hyderabad Hyderabad murder Hyderabad News Wife Murdered her Husband Telanagana Crime News

సంబంధిత కథనాలు

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Hyderabad Crime News: భర్త ఆత్మహత్యాయత్నం, తనవల్లేనని తనువుచాలించిన ఇల్లాలు - తట్టుకోలేక తల్లి బలవన్మరణం

Hyderabad Crime News: భర్త ఆత్మహత్యాయత్నం, తనవల్లేనని తనువుచాలించిన ఇల్లాలు - తట్టుకోలేక తల్లి బలవన్మరణం

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ