By: ABP Desam | Updated at : 22 Mar 2023 10:26 AM (IST)
Edited By: jyothi
తోటివిద్యార్థితో కూతురి ప్రేమ పెళ్లి - తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
Hyderabad Crime News: ఆమె పుట్టినప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంది. తనకు ఏం కావాలన్నా అమ్మా అమ్మా అంటూ వెనకే వస్తే ఆనందపడిపోయింది. తనకు తెలియకుండా తన కూతురు ఏం చేయదు అనుకునేది. ఆ పాప కూడా అన్ని విషయాలు ఆమెతో చెప్పేది. అయితే పాప పెద్దదై కాలేజీకి వెళ్తోంది. ఈ క్రమంలోనే తన తోటి విద్యార్థితో ప్రేమలో పడింది. ఇంట్లో చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అది తట్టుకోలేని తల్లి ఇంట్లోని తన గదిలోకి వెళ్లి ఉరివేసుకొని చనిపోయింది.
అసలేం జరిగిందంటే..?
కూకట్ పల్లి జయానగర్ కాలనీలోని మైత్రేయి నిలయంలో ప్రైవేటు ఉద్యోగి గోనుగుంట శ్రీనివాస రావు, నిర్మల కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే వీరికి కుమారుడు సాయితేజ, కుమార్తె ఉన్నారు. ఇటీవలే కూతురు తనతో పాట చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమించింది. ఈనెల 17వ తేదీన ఇంట్లోంచి వెళ్లిపోయి అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తల్లి నిర్మల తీవ్రంగా మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తన బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు మరో తాళం చెవితో తలుపులు తెరిచి చూడగా... తల్లి చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. దీంతో కుమారుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. గట్టిగా ఏడ్వడంతో తండ్రి వచ్చాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇటీవలే ఏపీలోని గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఓ ఆటో డ్రైవర్ ను ప్రేమించింది. వద్దని చెబుతున్నా వినకుండా అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన పరువు పోయిందని బావురుమంది. ఊళ్లో వాళ్లు అంటున్న మాటలు వినలేక.. తన కూతురు పరువు తీసి వెళ్లిపోయిందని భావించిన తల్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కూతురు ప్రేమ పెళ్లితో తమ పరువు పోయిందని..
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండారం గ్రామంలో పరువు ఆత్మహత్య చోటు చేసుకుంది. దాసరి అనితకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం అయింది. అయితే రెండో కుమార్తె డిగ్రీ చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసుకున్న తల్లి పలుమార్లు కూతురును మందలించింది. ఈ నెల ఏడవ తేదీన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన ఆటో డ్రైవర్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లి అనిత తల్లడిల్లి పోయింది. గ్రామంలో పలు విధాలుగా ప్రచారం జరగడంతో తట్టుకోలేక పోయింది. ఈ ప్రేమ వివాహంతో తమ కుటుంబ పరువు రోడ్డుపై పడిందని ఆవేదన చెందింది.ఈ క్రమంలోనే ఆమె నిన్న రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న చేబ్రోలు పోలీసులు విచారణ చేస్తున్నారు.
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!
Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!
Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!