By: ABP Desam | Updated at : 08 Feb 2023 10:21 AM (IST)
Edited By: jyothi
ప్రేమించి పెళ్లాడింది, అతడి మెప్పు కోసం మరో వివాహం చేసింది - ఆపై సవతితో కలిసి ఖతం చేసింది!
Hyderabad Crime News: వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయిన ఇద్దరూ పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టారు. ఏడేళ్లపాటు వీరి కాపురం హాయిగా సాగింది. ఆ తర్వాత నుంచే భార్యకు కల్లు, మద్యానికి అలవాటు పడింది. బానిసగా మారింది. భర్త మెప్పు కోసం అతడికి ఓ 17 ఏళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేసింది.
వ్యసనాల బారిన పడ్డ మొదటి భార్యను వదిలించుకోవడానికి అతడు స్కెచ్ వేశాడని గ్రహించి కౌంటర్ ప్లాన్ వేసింది. అది కూడా అతనికి ఇష్టమైన రెండో భార్యతోనే మొదటి భార్య స్పాట్ పెట్టింది. కడతేర్చింది. ఫుల్లుగా మద్యం తాగించి అతని మెడకు చన్నీని చుట్టి చెరోవైపు లాగి మరీ చంపేశారా ఇద్దరు సతీమణిలు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఓ సంచిలో కట్టి వాళ్లుంటున్న రెండో ఫ్లోర్ నుంచి కింద పడేశారు. అనంతరం చేతులు దులుపుకొని సరికొత్త డ్రామా మొదలు పెట్టారు. కానీ చివరకు బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు చిక్కారు.
అసలేం జరిగిందంటే..?
సురేష్, రేణుకలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే 2016లో ప్రేమ వివాహం జరిగింది. ఆమె క్రమంగా చెడు వ్యసనాల బాట పట్టింది. ప్రతిరోజూ మద్యం, కల్లు దుకాణాల వద్దే కూర్చొని మరీ ఫుల్లుగా తాగేది. ఆపై తూలుతూ ఇంటికొచ్చేది. మద్యం మత్తులో ఎవరితో పడితే వాళ్లతో మాటలు కలిపేదనే ఆరోపణలు కూడా రేణుకపై ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం బహదూర్ పల్లిలోని ఓ కల్లు దుకాణం వద్ద దుండిగల్ తండాకు చెందిన అనాథ బాలికతో మాట కలిపింది. ఇలా ఆమెతో స్నేహం పెంచుకుంది. బాలికకు ఎవరూ లేకపోవడంతో తన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంది. రేణుక, సురేష్ లతో పాటే 15 రోజుల పాటు బాలిక అక్కడే ఉంది.
భర్త మెప్పు పొందేందుకు ఇంటికి వచ్చిన ఆ చిన్నారితో.. రహస్యంగా ఇంట్లోనే భర్తకు ఇచ్చి పెళ్లి చేసింది. అయితే సురేష్ క్రమంగా బాలికకు దగ్గరవడం ప్రారంభించాడు. ఆమెపై ఆసక్తి చూపించడం, మొదటి భార్య రేణుకను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముగ్గురూ కలిసి ఆదివారం రోజు ఫుల్లుగా తాగారు. భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో బాలికతో కలిసి శాలువాను మెడకు బిగించి... ఇద్దరు భార్యలు చెరోవైపు పట్టుకొని గట్టిగా లాగారు. ఈ క్రమంలోనే సురేష్ మృతి చెందాడు. అయితే భర్త చనిపోయినట్లు నిర్ధారించుకున్న సతీమణులు... ఓ సంచిలో అతడి మృతదేహం వేసి వాళ్లు ఉంటున్న భవనం రెండో ఫ్లోర్ నుంచి ఇంటి ముందు పడేశారు. అయితే ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు అందమైన కట్టుకథను కూడా అల్లారు.
భర్తను చంపి కింద పడేసిన అనంతరం నరేష్ బంధువులకు ఫోన్లు చేసిన రేణుక... తినేందుకు మటన్, మల్లెపూలు తీసుకురావాలని భర్తను బయటకు పంపించినట్లు తెలిపింది. అయితే అతడు తిరిగి రాలేదని రేణుక నమ్మబలికింది. మరుసటి రోజు తన భర్తను ఎవరో చంపి.. ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేసినట్లు సమాచారం. ఏమీ తెలియనట్లు ఠాణాకు వెళ్లి విలపించింది. బంధువులు భార్యపై అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్