అన్వేషించండి

Anantapur: బాత్రూంలో షాక్ కొట్టి చనిపోయిన భర్త.. వెంటనే కుప్పకూలి భార్య కూడా.. కన్నీరు పెట్టించే ఘటన

చిన్నచిన్న సంఘటలనకే విడిపోతున్న బార్యభర్తలను చూస్తున్నాం. కానీ పెళ్ళి ప్రమాణాలతో ఒక్కటైన జంట మరణంలోను కలిసి వెళ్లడం విషాదాన్ని నింపింది.

కొంత మంది భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాయో అందరికి తెలిసిందే. చిన్న చిన్న మనస్పర్దలకే కాపురాలు కుప్పకూలిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ రోజుల్లో కూడా భార్యాభర్తల మధ్య సంబందాలు ఎంత బలంగా ఉన్నాయో చాటే సంఘటన హిందూపురంలో జరిగింది. భర్త లేకపోతే తాను కూడా బతకలేను అని రోదిస్తూ ఆయన మృతదేహం ముందే భార్య కుప్పకూలి పోయింది. ఈ హృదయ విదార ఘటన చూసి స్థానికుల కంట్లోనూ నీళ్లు తిరిగాయి.

హిందూపురంలోని శాంతినగర్ కు చెందిన నజీమ్ రజీ(36) జనరేటర్ మరమ్మత్తులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. నజీమ్‌కు పదమూడేళ్ల క్రితం షాజియా కౌసర్ (29)తో వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరికి 13 ఏళ్లు కాగా, ఇంకొకరికి మూడేళ్లు. మరో కుమార్తెకు ఏడేళ్లు. అన్యోన్యంగా సాగే ఈ కుటుంబం ప్రస్తుతం విషాదంలో మునిగిపోయింది. ఐతే గత నాలుగురోజుల క్రితం కర్ణాటకలోనే దావణగెరె జిల్లా చెన్నగిరికి తన మరదలి పెళ్లికి వెళ్లారు. ఈ క్రమంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మరదలి పెళ్ళితో సందడిగా ఉన్న అత్తారిల్లు విషాదంతో  నిండిపోయింది.

ఓ వైపు పెళ్ళి ఏర్పాట్లు జరగుతుండగా, మరోవైపు బాత్రూంలో స్నానానికి వెళ్లిన నజీమ్ రజీ గీజర్ షాక్ కొట్టి మరణించాడు. చనిపోయిన భర్తను చూసి షాక్ కు గురై భార్య షాజియా కౌసర్ కూడా కుప్పకూలిపోయింది. జీవితాంతం కలిసుంటామని పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట మరణంలోను కలిసే వెల్లారు. పెళ్లికి వెళ్లిన నజీమ్ కుటుంబం.. విగతజీవులుగా హిందూపురం రావడం ఆ ప్రాంత వాసులను కలిచివేసింది. ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. అన్యోన్యంగా సాగే కుటుంబం విధి ఆడిన నాటకానికి బలయిపోయింది. 

బుధవారం వీరు మరణించగా నిన్న రాత్రికి హిందూపురానికి దంపతులు మృతదేహాలు వచ్చాయి. పలువురు నివాళులు అర్పించి సానుభూతిని తెలియచేశారు. భార్య భర్తల మధ్య చిన్నిచిన్న వివాదాలకే అనేక విడిపోతున్న ఘటనలు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: Hyderabad: మీరు అపార్ట్‌మెంట్లలో ఉంటారా? ఈ సౌకర్యం ఫ్రీగా పొందండి.. ఇంకా రెండు రోజులే ఛాన్స్

Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్

Also Read: Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..

Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget