Weapons Missing In Hyderabad: బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
బొల్లారం ఆర్మీ యూనిట్లో తాళాలు పగలగొట్టి ఏకే-47 తుపాకులు చోరీ కావడం కలకలం రేపింది. సెలవు నిరాకరణే కారణమనే అనుమానాలు ఉండగా, మిలిటరీ బ్రిగేడియర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangana Top Stories | సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ యూనిట్కు చెందిన ఆయుధ విభాగంలో (బెల్ ఆఫ్ ఆర్మ్స్) గన్స్ కనపడకుండా పోవడం కలకలం రేపింది. డిపోలోని రూమ్ తాళాలు పగలగొట్టి 4 ఏకే-47 తుపాకులతో పాటు మరికొన్ని కీలక ఆయుధాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు అధికారులు మంగళవారం నాడు గుర్తించారు. తోటి అధికారికి సెలవు ఇవ్వకపోవడం వల్ల తలెత్తిన వివాదం కారణంగానే ఈ ఆయుధాలు మాయమయ్యాయనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ విషయంపై ఆర్మీ లేదా పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై మిలిటరీ బ్రిగేడియర్ బొల్లారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆయుధాలు మాయమైన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్మీ అధికారులు సికింద్రాబాద్ కంటోన్మెంట్, బొల్లారం పరిధిలోని మిలిటరీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా బొల్లారంలోని కొన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేయడంతో పాటు, సైనిక, సివిల్ రహదారుల గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ఆర్మీ, పోలీస్ సిబ్బంది తీవ్రంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్మీ అధికారులు అంతర్గత విచారణను వేగవంతం చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు మరియు సిబ్బంది వివరాలను సేకరించి మిస్సింగ్ ఆయుధాల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
ట్రెండింగ్ వార్తలు






















