అన్వేషించండి

Guntur News: పార్టీ ప్రాణం తీసింది, కాల్వలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి

పార్టీ చేసుకునేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు అనుకోని విధంగా మృత్యువాత పడ్డారు. పార్టీ హుషారులో కాల్వలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

నలుగురు స్నేహితులు సరదాగా కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం చల్లగుండ్ల వద్ద గల గోరంట్ల బ్రాంచ్ కెనాల్(Gorantla Branch Canal) లో ఈతకు దిగి గల్లంతైన(Drown) సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగ గుంటూరు జిల్లా(Guntur District) కుంకలగుంట గ్రామానికి చెందిన నలుగురు యువకులు చల్లగుండ్లలోని గోరంట్ల మేజర్ కెనాల్ ఒడ్డున పార్టీ చేసుకున్నారు. అనంతరం ఈతకు కెనాల్ లో దిగిన వర్ణ శ్రీను, నందిగం ఏడుకొండలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులు నీటి ప్రవాహం నిలిపివేసి వెతుకులాట ప్రారంభించారు. చీకటి సమయం కావడంతో వెతుకులాట ఇబ్బందికరంగా మారింది. నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్ఐ సురేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బంధువులు, స్థానికుల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించారు. గురువారం ఉదయం గల్లంతైన  శ్రీను మృతదేహం లభ్యమయింది. మధ్యాహ్నం ఏడు కొండలు మృతదేహం దొరికింది. మృతదేహాలను పోస్టు మార్టం కోసం  నర్సారావుపేట ప్రభుత్వ హాస్పటల్(Narsaraopeta Govt Hospital) కు తరలించారు. 

Also Read: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, కరోనా ముందు విధంగా దర్శనాలు, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బావిలో పడి 13 మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్‌(UttarPradesh)లో ఘోర విషాదం జరిగింది. ఖుషీనగర్​లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో బావిలో పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వివాహానికి(Marriage) ముందు నిర్వహించిన హల్దీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పరేమేశ్వర్ కుష్వాహా అనే వ్యక్తికి సంబంధించిన వివాహ వేడుక నెబువా నౌరాంగియాలో నిర్వహించారు. హల్దీ కార్యక్రమానికి భారీగా అతిథులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో 50-60 మంది మహిళలు, బాలికలు ఓ బావి దగ్గర వేడుకలు చేసుకున్నారు. ఇనుప కంచెతో మూసేసిన ఆ పాడుబడ్డ బావిపై కొంతమంది నిల్చున్నారు. అయితే బరువు ఎక్కువ కావడం వల్ల కంచె విరిగిపోయింది. కొంతమంది బావిలో పడిపోయారు. వెంటనే చుట్టూ ఉన్నవారంతా వచ్చి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో 13 మంది మరణించారని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Also Read: ఏపీలో రూ. 3 లక్షల కోట్ల విలువైన రోడ్లు, 2024 నాటికి రాయపూర్‌- విశాఖ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
Kamareddy Crime News: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
Bengal election polling: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?
బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?
Petrol and diesel shortage: రేట్లు పెంచే ముందు వ్యూహాత్మకంగానే పెట్రోల్, డీజిల్ కొరత - ఆయిల్ కంపెనీల ప్లాన్ అదేనా?
రేట్లు పెంచే ముందు వ్యూహాత్మకంగానే పెట్రోల్, డీజిల్ కొరత - ఆయిల్ కంపెనీల ప్లాన్ అదేనా?
Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
Festivals in May 2026 : హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
Viral Video: సోదరి అస్తిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి.. బ్యాంక్ సిబ్బంది షాక్.. ఎందుకిలా చేశాడంటే !
సోదరి అస్తిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి.. బ్యాంక్ సిబ్బంది షాక్.. ఎందుకిలా చేశాడంటే !
జంథ్యం ఏ సమయాల్లో తీయాలి? ఎప్పుడు మార్చుకోవాలి? యజ్ఞోపవీతం వేసుకుని ఏ పనులు చేయకూడదు?
జంథ్యం ఏ సమయాల్లో తీయాలి? ఎప్పుడు మార్చుకోవాలి? యజ్ఞోపవీతం వేసుకుని ఏ పనులు చేయకూడదు?
Sodara OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget