అన్వేషించండి

Guntur Crime News: గర్భిణీపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు 20  ఏళ్ల జైలు శిక్ష

Guntur Crime News: గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్త కళ్లెదుటే గర్భిణీపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జిల్లా సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 

Guntur Crime News: ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్ లో నాలుగు నెలల గర్భిణీపై భర్త కళ్లెదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులు ఇద్దరికీ జిల్లా సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రేపల్లె నేతాజీ నగర్ కు చెందిన  20 ఏళ్ల పాలుబోయిన విజయకృష్ణ, 25 ఏళ్ల పాలుదురి నిఖిల్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. గుంటూరు జిల్లా నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏ3గా ఉన్న నిందితుడు మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. 

వివాహితపై కీచకులు అఘాయిత్యం.. 
2022 మే ఒకటో తేదీన నాలుగు నెలల గర్భిణీ అయిన ఎస్సీ మహిళ.. ఆమె భర్త, ముగ్గురు పిల్లలతో రాత్రి రైల్వే స్టేషన్ లో పడుకుంది. అయితే అటుగా వచ్చిన ముగ్గురు నిందితులు.. ఆమె భర్తతో కావాలని గొడవ పెట్టుకున్నారు. ఆపై గర్భిణీ అయిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త కళ్లెదుటే ఆమెను లైంగికంగా వేధించారు. ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్తున్న ఈ జంట.. మార్గ మధ్యంలో రైల్వే స్టేషన్ లో పడుకోగా.. నిందితులు ఆ అరాచకానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు మహిళపై అత్యాచారం చేయగా.. మరో యువకుడు వీరికి సాయం చేశాడు. అయితే భార్యకు నరకం చూపిస్తున్న నిందితుల వద్ద నుంచి తప్పించుకొని రైల్వే పోలీసు కార్యాలయం వద్దకు వెళ్లి ఎంతగా అరిచినా అతని ఆక్రందన విని ఒక్కరు కూడా స్పందించలేదు. అలాగే ఎవరిని సాయం అడిగినా ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ దారుణాన్ని ఆపలేరు. 

ఇద్దరు పిల్లలను ప్లాట్ ఫాంపై అలాగే వదిలేసి.. ఓ బిడ్డను భుజాన వేసుకొని అర్ధరాత్రి వేళ భార్యను కాపాడుకునేందుకు ఆయన పోలీస్ స్టేషన్ చేరుకున్న దయనీయ స్థితి ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకునే వరకూ ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా రేపల్లె పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉపాధి పనుల నిమిత్తం బాధితురాలు భర్త, ముగ్గురు పిల్లలతో కలిపి 2022 మే ఒకటో తేదీన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి బయల్దేరారు. గుంటూరు తెనాలి మీదుగా రేపల్లె రైల్వే స్టేషన్ కు శనిరావం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు. అప్పుడు నాగాయలంక వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో బాధిత కుటుంబం రైల్వే స్టేషన్ లోనే నిద్రించింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు యువకులు వారి వద్దకు వచ్చారు. బాధితురాలి భర్తను నిద్రలేపి సమయం ఎంత అయిందని అడిగారు. తన వద్ద వాచీ లేదని అతను సమాధానం ఇవ్వడంతో ఆ ముగ్గురూ అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు. అతని వద్ద ఉన్న రూ.750 లాక్కున్నారు. బాధితురాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిలో ఇద్దరు ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. మరొకరు ఆమె భర్తను నిర్బంధించారు. బాధితురాలిని ప్లాట్ ఫాం చివరి వరకూ ఈడ్చుకుంటూ వెళ్లి భర్త కళ్లెదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. రైల్వే స్టేషన్ లోనే ఈ ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఆమెను చిత్ర హింసలు పెట్టారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget