అన్వేషించండి

Rajkot Fire Accident: గుజరాత్‌లో గేమ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం, 22 మంది సజీవ దహనం

TRP game zone in Rajkot: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 7 గంటలవరకు 20 మృతదేహాలను బయటకు తీసినట్లు రాజ్‌కోట్ కమిషనర్ తెలిపారు.

fire breaks out at the TRP game zone in Rajkot| రాజ్‌కోట్: గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌కోట్ లోని టీఆర్పీ గేమ్ జోన్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ ఆవరించి ఊపిరాడక భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకూ చిన్నారులు, మహిళలు సహా 22 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్ఛారు.


Rajkot Fire Accident: గుజరాత్‌లో గేమ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం, 22 మంది సజీవ దహనం

ఈ అగ్నిప్రమాదం ఘటనపై రాజ్‌కోట్‌ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ స్పందించారు. శనివారం మధ్యాహ్నం టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, తక్కువ సమయంలోనే గేమింగ్ జోన్ మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరకూ సుమారు 20 మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసినట్లు తెలిపారు. ఇందులో చిన్నారుల మృతదేహాలు కూడా ఉన్నాయని, ఘటన జరగడం చాలా దురదృష్టకరం అన్నారు.

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తికి చెందిన టీఆర్పీ గేమ్ జోన్‌లో ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని సీపీ రాజు భార్గవ తెలిపారు. 

Rajkot Fire Accident: గుజరాత్‌లో గేమ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం, 22 మంది సజీవ దహనం

రాజ్‌కోట్ చరిత్రలో అతిపెద్ద విషాదం 
టీఆర్పీ గేమ్ జోన్‌లో జరిగిన ఘోర విషాదంపై బీజేపీ ఎమ్మెల్యే దర్శితా షా స్పందించారు. ఈ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం అన్నారు. నేడు రాజ్‌కోట్‌లో చాలా విచారకరమైన ఘటన జరిగింది. అగ్నిప్రమాదంలో చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరగడం రాజ్‌కోట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. రెస్క్యూ టీమ్ వీలైనంత  మందిని రక్షించడానికి ప్రయత్నాలు చేసిందన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget