అన్వేషించండి

Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు - చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు, మరో ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

Siricilla News: తెలంగాణలో ఒకే రోజు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్కూల్ బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన తీవ్ర విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

Child Died By Hitting Bus In Siricilla: ఆ చిన్నారి ప్రతి రోజూలాగే ఉత్సాహంగా స్కూలుకు బయలుదేరింది. పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తన కుటుంబ సభ్యులకు బాయ్ చెప్తూ 'అమ్మా వెళ్లొస్తా' అంటూ స్కూల్ బస్సు ఎక్కింది. ఇంతలోనే ప్రమాదం రూపంలో మృత్యువు ఆ చిన్నారిని కబళించింది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తీవ్ర విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Siricilla) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన రాజు, వెంకటలక్ష్మి దంపతులకు గత కొన్నేళ్లుగా పిల్లలు లేరు. దీంతో వీరు మనోజ్ఞ (5) అనే చిన్నారిని పెంచుకుంటున్నారు. ఉపాధి నిమిత్తం రాజు సౌదీ వెళ్లగా.. వెంకటలక్ష్మి కుమార్తెను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజూలానే కుమార్తెను సోమవారం కూడా వెంకటలక్ష్మి కుమార్తెను స్కూలుకు పంపింది.

బస్సు టైరు కింద పడి..

మనోజ్ఞ (5) పాఠశాలలోని తరగతి గదికి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న ఓ బస్సు వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సద్దిచెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేలిన ప్రైవేట్ బస్సు టైర్

అటు, జనగామ జిల్లాలో (Janagam District) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ బస్సు బోల్తా పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ మండలం యశ్వంత్‌పూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై రన్నింగ్‌లోనే టైరు పేలి ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బెంగుళూరు నుంచి వరంగల్ వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బస్సు బోల్తాతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో సహాయక చర్యలు చేపట్టారు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

అలాగే, హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన క్యాబ్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో సాయితేజ అనే ఉద్యోగి మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద మరో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని నీలయరెడ్డి అనే వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్‌ను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Crime News: బజ్జీల కోసం దారుణం - అరువు ఇవ్వలేదని వేడి నూనె పోసేశాడు, ఎక్కడంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Ind Vs SA W Odi World Cup Final Score Update: టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు, ఇక బౌల‌ర్ల‌పైనే భారం.. ప్రొటీస్ తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ 
టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు, ఇక బౌల‌ర్ల‌పైనే భారం.. ప్రొటీస్ తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ 
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Advertisement

వీడియోలు

India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Ind Vs SA W Odi World Cup Final Score Update: టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు, ఇక బౌల‌ర్ల‌పైనే భారం.. ప్రొటీస్ తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ 
టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు, ఇక బౌల‌ర్ల‌పైనే భారం.. ప్రొటీస్ తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ 
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
Embed widget