అన్వేషించండి

Crime News: ఈ గోపాల్ దృశ్యం సినిమాలో హీరో - కూతుర్ని వేధిస్తున్న వ్యక్తిని చంపేశాడు - శవం కూడా దొరకనీయలేదు !

Narayana Khed: కూతుర్ని వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని తండ్రి చంపేసిన ఘటన నారాయణ ఖేడ్‌లో జరిగింది. ఆ వ్యక్తి మృతదేహాన్ని కూడా కనిపించనీయలేదు.

Narayana Khed Crime News: తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడ్నిచంపేస్తాడు తండ్రి. ఆ యువకుడి శవం కూడా కనిపించనీయడు. అతనిపై పోలీసులకు అనుమానం ఉన్నా సరే ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ యువకుడు హత్యకు గురయ్యాడన్నదానికి కూడా ఆధారాలు ఉండవు. అచ్చంగా ఇలాగే కాకపోయినా చిన్న మార్పుతో ఇదే ప్లాన్ అమలు చేశాడో తండ్రి.            
 
నారాయణఖేడ్ జిల్లాలోని  మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలిక ను దశరథ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతనికి పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు.  ఆ బాలిక తనను దశరథ్ వేధిస్తున్నాడని తండ్రికి చెప్పింది.. ఒకటికి రెండు సార్లు.. దశరథ్ ను తండ్రి హెచ్చరించాడు. తన కుమార్తె జోలికి  రావొద్దని చెప్పాడు. అయితే దశరథ్ మాత్రం.. తన వేధింపులు ఆపలేరు. తన కుమార్తె ఇక భయపడకుండా ఉండాలంటే.. దశరథ్ ను పైకి పంపడమే మార్గం అని బాలిక తండ్రి గోపాల్ నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం స్కెచ్ వేశాడు.                 

ఓ రోజు దశరథ్ కు మంచి  మాటలు చెప్పిన గోపాల్.. తనో పాటు నిజాంపేట మండల శివారు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ దశరథ్ ను సైలెంట్ గా చంపేశాడు. అడవి లోపలకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే తన కుమార్తె కోసం.. చేసిన హత్య విషయంలో సైలెంట్ గా ఉండలేకపోయాడు. దృశ్యం సినిమా హీరోలాగా ఓ వ్యక్తిని చంపిన వేదన మనసులో ఉండటం.. ఎప్పటికైనా దొరికిపోతానన్న భయంతో ఆయన నారాయణ ఖేడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి .. పోలీసులకు జరిగినదంతా చెప్పారు.         

Also Read: Viral News: బాయ్‌ఫ్రెండ్ అలా చేశాడని డయల్ 100కు కాల్ చేసిన యువతి, సీరియస్‌గా తీసుకున్న పోలీసులు! 

అప్పటికే పోలీసులకు దశరథ్ అదృశ్యంపై ఫిర్యాదు వచ్చింది. అతని కుటుంబసభ్యులు దశరథ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గోపాల్ ను తీసుకుని తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లారు. కానీ ఎక్కడ తగులబెట్టాడో గోపాల్ కూడా మర్చిపోయాడు. పోలీసులు దశరథ్ హత్యకు గురైన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో వారు బోరున రోదించారు. దశరథ్‌కు  భార్య ఇద్దరు  పిల్లలు ఉన్నారు. కనీసం మృతదేహం అయినా చూపించాలని వారు పోీలసుల్ని వేడుకున్నారు.                                    

గోపాల్ .. దశరథ్ ను చంపి ఎక్కడ కాల్చాడో కనుక్కుని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కుమార్తెను వేధిస్తున్నందుకే చంపానని గోపాల్ చెబుతున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.  

Also Read: "పైలట్‌ రామ్‌"- 'యశస్' యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి

 

టాప్ హెడ్ లైన్స్

Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget