దక్షిణ కన్నడ జిల్లాలో పట్టపగలే 21 ఏళ్ల యువతి లావణ్యను బస్టాండ్లో ఓ యువకుడు కొడవలితో దాడి చేసి హత్య చేశాడు. ప్రేమ పేరుతో వేధించి, ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలోని బంట్లా బస్ స్టాండ్లో లావణ్య అనే యువతిపై ఆమె దూరపు బంధువు చేతన్ కొడవలితో దాడి చేసి దారుణంగా నరికి చంపాడు. ఏకపక్ష ప్రేమే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు.

- కర్ణాటకలో పట్టపగలే యువతి లావణ్య దారుణ హత్య.
- దూరపు బంధువైన చేతన్ ప్రేమ పేరుతో వేధించాడు.
- బస్టాండ్ వద్ద కొడవలితో దాడి చేసి పారిపోయాడు.
- పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు: పట్టపగలే అందరూ చూస్తుండగా కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో యువతి దారుణ హత్య కలకలం రేపింది. బాంట్లా తాలూకా బి.సి. రోడ్డు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో గురువారం సాయంత్రం ఓ యువకుడు కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి యువతిని హత్య చేశాడు.
ప్రేమ పేరుతో వేధించి, ప్రాణాలు తీశాడు
కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో లావణ్య (21) అనే యువతి పనిచేస్తోంది. ఎప్పలిలాగే డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరుగుప్రయాణమైన సమయంలో బస్టాండ్ కు చేరుకున్న యువతిపై నిందితుడు చేతన్ కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి నరికి చంపాడు. మృతురాలు కక్కెపడవు గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు.
A rare scene that has happened in the Mangalore region.
— Sharanya Shettyy (@Sharanyashettyy) July 16, 2026
A 21-year-old, Lavanya, was brutally hacked to death by her ex, four years after their relationship had ended. The accused, 22-year-old Chetan, who is also a distant relative, attacked her in broad daylight at a bus stop… pic.twitter.com/3wo95zZUnD
యువతికి దూరపు బంధువే నిందితుడు
నిందితుడిని బెల్తంగడి తాలూకా ఓడిల్నాలకు చెందిన చేతన్ (22)గా పోలీసులు గుర్తించారు. అతడు మృతురాలికి దూరపు బంధువు కాగా, ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. కొంతకాలం నుంచి అతడి వేధింపులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం లావణ్య కక్కెపడవు వెళ్లే బస్సు ఎక్కగా, నిందితుడు కూడా ఆమెను ఫాలో అయ్యాడు. తర్వాత ఆమె బస్సు దిగగానే, వెంట తెచ్చుకున్న కొడవలితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆయుధాన్ని అక్కడే పడేసి నిందితుడు చేతన్ పారిపోయాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన లావణ్యను బాంట్లా తాలూకా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ ఎస్పీ కె. అరుణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు చేతన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాంట్లా టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Frequently Asked Questions
కర్ణాటకలో జరిగిన దారుణం ఏమిటి?
హత్యకు గురైన యువతి ఎవరు, ఘటన ఎక్కడ జరిగింది?
మృతురాలు 21 ఏళ్ల లావణ్య. ఆమె కల్లాడ్కలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేది. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని బి.సి. రోడ్డు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగింది.
నిందితుడు ఎవరు, అతనికి యువతికి ఉన్న సంబంధం ఏమిటి?
నిందితుడు 22 ఏళ్ల చేతన్. ఇతను మృతురాలికి దూరపు బంధువు. గతంలో వారి బంధం ముగిసినా, ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
దక్షిణ కన్నడ ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు చేతన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. బాంట్లా టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























