అన్వేషించండి

AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో 12 కొవిడ్ కేసులు నమోదవగా, నలుగురు మృతి చెందారని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో వీటీఎం, పీపీఈ కిట్ల కొరత, ఆక్సిజన్ ప్లాంట్లు నిరుపయోగంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌లో 12 కొవిడ్ కేసులు; నలుగురు మరణించారు.
  • కడపలో ముగ్గురు, కాకినాడలో ఒకరు మృతి; సహ-వ్యాధులతో.
  • వైరస్ జన్యు విశ్లేషణకు పుణెకు ఐదు నమూనాలిచ్చారు.
  • ఆసుపత్రులకు మార్గదర్శకాలు; వైద్య సామాగ్రి కొరతపై ప్రశ్నలు.

అమరావతి: భారత్‌లో మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో నలుగురు బాధితులు మృతి చెందారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 

కడపలో ముగ్గురు, కాకినాడలో ఒక్కరు మృతి
కరోనా బారిన పడిన మరణించిన వారిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారని, వారంతా ఇదివరకే తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో (కో-మార్బిడిటీస్) బాధపడుతున్నారని వీరపాండియన్ స్పష్టం చేశారు. వైరస్ జన్యు క్రమ స్వరూపాన్ని  విశ్లేషించేందుకు 5 శాంపిల్స్ సేకరించి పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. 

కడపలో అత్యధిక కరోనా కేసులు

ఏపీలో నమోదైన మొత్తం కోవిడ్19 కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రజలెవరూ ఆందోళన చెందకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని  ఆయన సూచించారు.

మరోవైపు, రాష్ట్ర సర్వైలెన్స్ విభాగం ఇప్పటికే అన్ని బోధనాసుపత్రులు, జీజీహెచ్‌లు, డీఎంహెచ్‌వోలకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా మందులు, ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.  క్షేత్రస్థాయిలో రోగుల నుంచి కరోనా పరీక్షల కోసం స్వాబ్ నమూనాలను సేకరించేందుకు అవసరమైన వీటీఎం కిట్లు, వైద్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

గతంలో భారీగా కొనుగోలు చేసిన పీపీఈ కిట్లలో వ్యాలిడిటీ ముగిసిపోవడంతో దాదాపు 45 లక్షల కిట్లు వృథాగా మారాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నిరుపయోగంగా మారడంతో తక్షణం దీనిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. కరోనా కేసులు, నివారణ చర్యలు, వైద్యశాఖ చేపట్టాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కరోనా కేసుల సంఖ్య, మరణాలు ఎన్ని?

ఆంధ్రప్రదేశ్‌లో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో నలుగురు బాధితులు మరణించారు.

మరణించిన కరోనా బాధితులు ఏ జిల్లాకు చెందినవారు, వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా?

మరణించిన వారిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. వారంతా ఇదివరకే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఏ జిల్లాలో నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన మొత్తం కోవిడ్19 కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రజలెవరూ ఆందోళన చెందకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget