అన్వేషించండి

Crime News: తెలంగాణలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య

Kamareddy News: కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసిన చంపిన తండ్రి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Father Forceful Death After His Children Thrown Into A Well: తెలంగాణలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) తాడ్వాయి మండలం నందివాడలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (35), అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేష్ (6), అనిరుథ్ (4) ఉన్నారు. శనివారం రాత్రి 7:30 గంటలకు దుర్గమ్మ నిమజ్జనానికి శ్రీనివాస్ రెడ్డి పిల్లలను తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటినా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య అతనికి ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి దాటాక 2 గంటల టైంలో ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించగా వారితో పాటు స్థానికులు సైతం వారి కోసం గాలింపు చేపట్టారు. 

వ్యవసాయ బావి వద్ద..

ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలను గుర్తించారు. అప్పటికీ తండ్రి శ్రీనివాసరెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన చెప్పులు, మొబైల్ సైతం బావి వద్దే ఉన్నట్లు పోలీసులు, స్థానికులు గుర్తించారు. పిల్లల మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు మోటారు సాయంతో బావిలోని నీటిని తోడించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని గుర్తించి వెలికితీయించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో..

అటు, నాగర్ కర్నూల్ జిల్లాలోనూ విషాదం నెలకొంది. ఓ ట్రాలీ ఆటో కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సరస్వతి ఆలయం పక్కన గల కేఎల్ఐ కాలువలో ఆటో బోల్తా పడి.. మంతటి గ్రామానికి చెందిన ఫాతిమాబేగం అనే మహిళ మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మంతటి గ్రామానికి చెందిన ట్రాలీ ఆటో అదే గ్రామానికి చెందిన కూలీలను తీసుకుని పొలానికి వెళ్తుండగా.. కాల్వ మలుపు వద్ద అదుపు తప్పి కాలువలో పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Crime News: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన - పోలీసుల దర్యాప్తు ముమ్మరం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cisco: తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
Revanth Reddy On Betting App Cases: బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
Bhadrachalam Latest News: భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cisco: తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
Revanth Reddy On Betting App Cases: బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
Bhadrachalam Latest News: భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Neha Kakkar Controversy: స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
Embed widget