అన్వేషించండి

Crime News: పొలంలోనే భార్య, పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య - అప్పుల భారంతో రైతు కుటుంబం బలవన్మరణం, కడప జిల్లాలో తీవ్ర విషాదం

Andhra News: కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు కుటుంబంతో సహా పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలకు ఉరేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Farmer's Family Commits Suicide In Kadapa District: అప్పుల భారం అధికమైంది. సాగు కష్టాల కడలిలోకి నెట్టింది. దీంతో ఆ రైతు కుమిలిపోయాడు. సాగు చేసిన పొలంలోనే తన భార్య పిల్లలకు ఉరేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కడప జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా పులివెందుల (Pulivendula) నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో ఓ కుటుంబం అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర (40) 15 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని గత 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు.  ప్రస్తుతం చీనీ తోట సాగు చేస్తుండగా.. తగిన ఆదాయం రాకపోగా అప్పుల భారం పెరిగింది.

ఈ క్రమంలో రుణదాతల నుంచి అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగ్గా.. దిక్కుతోచని స్థితిలో నాగేంద్ర.. భార్య వాణి (38), కుమార్తె గాయత్రి (12), కుమారుడు భార్గవ్ (11) రాత్రి 9 గంటల ప్రాంతంలో తోటలోకి తీసుకెళ్లారు. భార్యకు, పిల్లలకు ఉరేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు కుటుంబం ఇంటి వద్ద లేదని గుర్తించిన స్థానికులు తోట వద్దకు వెళ్లి చూడగా పొలంలో వీరి మృతదేహాలు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒకే కుటుంబంలో నలుగురి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

డిప్యూటీ సీఎం పవన్ స్పందన

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు కుటుంబం ఆత్మహత్య బాధాకరమని.. దీనిపై విచారణ జరుగుతోందని అన్నారు. రెండ్రోజుల క్రితం రైతు తన భూమి మ్యుటేషన్ పెట్టుకున్నారని.. ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందో నివేదిక వచ్చాకే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget