అన్వేషించండి

Engineering Students Dies: తమిళనాడులో రోడ్డు ప్రమాదం, ఏపీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మృతి

Engineering Students of Andhra Pradesh dies | ఏపీలోని ఒంగోలు ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు తమిళనాడులోని తిరువళ్లూరు నుంచి తిరిగిస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు మృతిచెందారు.

BTech Students of Andhra Pradesh dies in Road Accident in Tamil Nadu | తిరువళ్లూరు: తమిళనాడులో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలో ఓ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఏపీలోని ఒంగోలుకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు ఒంగోలులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారని తెలుస్తోంది. మృతులను చేతన్‌రామ్‌, యుకేష్‌, నితీశ్‌, నితీశ్‌ వర్మ, చైతన్య విష్ణుగా తిరువళ్లూరు పోలీసులు గుర్తించారు. ఒంగోలులో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు శనివారం ఒంగోలు నుంచి తిరువళ్లూరు వెళ్లారు. వీకెండ్ ముగియడంతో ఒంగోలుకు తిరిగి వస్తుండగా ఆదివారం వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. లారీ, కారు ఢీకొనడంతో బీటెక్ విద్యార్థులు ఐదుగురు దుర్మరణం చెందడంతో విషాదం చోటు చేసుకుంది.

ప్రమాదం నన్ను కలచివేసింది - మాజీ సీఎం జగన్
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు చనిపోయారన్న వార్త తీవ్రంగా కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బీటెక్ విద్యార్థులు మృతిచెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఏపీ ప్రభుత్వం మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

Also Read: Divvela Madhuri: దువ్వాడ వాణి ఆరోపణలు బాధించాయి, నా చావుకు ఆమెనే కారణం- రోడ్డు ప్రమాదంపై మాధురి కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి నలుగురి మృతి
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి నలుగురి మృతి
Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
Budget 2025: బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి నలుగురి మృతి
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి నలుగురి మృతి
Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
Budget 2025: బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
Nikhil Malayakkal: సింగిల్ అని మరోసారి కన్ఫామ్ చేసిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్... కావ్యతో అంతా ముగిసినట్టేనా?
సింగిల్ అని మరోసారి కన్ఫామ్ చేసిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్... కావ్యతో అంతా ముగిసినట్టేనా?
Batool Begum : రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..
రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..
Republic Day Google Doodle: రిపబ్లిక్ డే గూగుల్ డూడుల్ చూశారా? దాన్ని ఎవరు రూపొందించారు? అర్థం ఏంటంటే
రిపబ్లిక్ డే గూగుల్ డూడుల్ చూశారా? దాన్ని ఎవరు రూపొందించారు? అర్థం ఏంటంటే
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Embed widget