అన్వేషించండి

Eluru: తల్లీకూతుర్లను ఇంటికి తెచ్చుకున్న ప్రియుడు, ఆమెతో సహజీవనం! విషాదం మిగిల్చిన కరెంటు బిల్లు!

Eluru News: ఆమెకు పెళ్లైంది. పాపు కూడా ఉంది. అయినా ఆమెతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్ధరి మధ్య గొడవ జరగడంతో... తల్లీ కూతుళ్లిద్దరినీ గునపంతో తలపై కొట్టి చంపాడు.

Eluru News: అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. చేతిలో ఐదేళ్ల చంటిపాపతో ఉండగానే తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఇన్నాళ్లుగా హాయిగానే సాగింది వీరి కాపురం. కానీ ఇటీవలే ప్రియుడు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యా గొడవలు ప్రారంభం అయ్యాయి. గతరాత్రి కూడా ఇలాగే గొడవ జరగగా.. తల్లీ కూతుళ్లిద్దరినీ ప్రియుడు గునపంతో కొట్టి చంపాడు. 

అసలేం జరిగిందంటే..?

ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామ పరిధి శ్రీరామ నగర్ లో శనివారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన దేవరపల్లి రవి పదేళ్ల క్రితం భార్యకు విడాకులు ఇచ్చారు. శ్రీరామ్ నగర్ కు చెందిన 35 ఏళ్ల సొంగా యేసుమరియమ్మ పదేళ్లుగా భర్త నుంచి దూరంగా 15 ఏళ్ల కుమార్తె అఖిలతో కలిస ఉంటున్నారు. రవి లారీ డ్రైవర్ గా పని చేసేటప్పుడు యేసుమరియమ్మతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తూ రెండేళ్లు ఏలూరులో ఉన్నారు. ఎనిమిదేళ్ల నుంచి శ్రీరామ్ నగర్ లో ఉంటున్నారు. అఖిల ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ప్రియుడు రవి ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. 

కరెంటు బిల్లు కట్టమంటే ఫుల్లుగా తాగి గొడవ చేశాడు..!

అయితే కరెంటు బిల్లు కట్టమని యేసుమరియమ్మ రవికి డబ్బులు ఇచ్చింది. అయితే ఆ డబ్బుతో రవి ఫుల్లుగా మద్యం తాగాడు. కరెంటు బిల్లు సకాలంలో చెల్లించనందుకు... జనవరి 30వ తేదీన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దీంతో వీరిద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆరోజు ఇద్దరూ గొడవ విపరీతంగా గొడవ పెట్టుకోగా.. ఇక ఇతడితో ఉండి లాభం లేదనుకొని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో యేసుమరియమ్మ కుటుంబ సభ్యులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం రవి వారి ఇంటికి వెళ్లాడు. బుద్ధిగా ఉంటాను ఇక నుంచి మరియమ్మతో పాటు అఖిలను ప్రాణంగా చూసుకొని సాకుతానని వారిని నమ్మించి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక మరియమ్మను గునపంతో కణితి మీద, అఖిలను తన వెనుక భాగంలో కొట్టి చంపాడు. వాళ్లు నొప్పితో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వరకూ అలాగే చూస్తుండిపోయాడు. 

ఎంతసేపు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో... వెలుగులోకొచ్చిన విషయం

శనివారం ఉదయం మరియమ్మ తమ్ముడు గురవయ్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా.. ఇద్దరి మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, రూరల్ సీఐ అంకబాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget