అన్వేషించండి

AP Crime News: ఏపీలో దారుణాలు - భార్యను నరికి చంపిన భర్త, ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేయించిన కోడలు

Andhra Pradesh News: ఏపీలో దారుణాలు వెలుగుచూశాయి. నంద్యాల జిల్లాలో ఓ భర్త మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు. అటు, అన్నమయ్య జిల్లాలో ఓ కోడలు ఆస్తి కోసం అత్తనే కిడ్నాప్ చేయించింది.

Husband Kills His Wife In Nandyal: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. మరో చోట చిన్న కోడలు ఆస్తి కోసం అత్తనే కిడ్నాప్ చేయించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన వడ్డే రమణ, సుగుణమ్మ భార్యాభర్తలు. చాలాకాలంగా రమణ తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం పెంచుకున్న రమణ నిద్రిస్తున్న భార్యను ఆదివారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఆస్తి కోసం అత్త కిడ్నాప్

అటు, ఆస్తి కోసం ఓ కోడలు తన అత్తనే కిడ్నాప్ చేయించి చిత్రహింసలు పెట్టించిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. రాజంపేట పట్టణంలోని మున్నూరులో ఆస్తి కోసం అత్త లక్ష్మి నరసమ్మను ఆమె చిన్న కోడలు తన బంధువులతో కిడ్నాప్ చేయించింది. కువైట్‌లో ఉన్న కొడుకుకు సీఐడీ పోలీసుల పేరిట బెదిరింపులకు కూడా చేయించింది. వారం రోజుల క్రితం అత్త లక్ష్మినరసమ్మను కిడ్నాప్ చేయించి రాయచోటికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టింది. తన ఆస్తిని బలవంతంగా వారి పేరిట ఉన్న పేపర్లలో వేలిముద్రలు వేసుకుని లాక్కున్నారని అత్త తెలిపింది. బంగారం, సెల్ ఫోన్ దౌర్జన్యంగా లాక్కొని తనను కిడ్నాపర్లు వదిలేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలిపై చర్యలు తీసుకుని తనను రక్షించాలని వేడుకుంది. అత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Hyderabad News: తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని వ్యక్తి భార్య కిడ్నాప్ - బాధితురాలిని రక్షించిన పోలీసులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Goldman Suryabhai Arrest: ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget