అన్వేషించండి

Anantapuram News : ల్యాప్‌టాాప్‌ ఆర్డర్ చేస్తే బండరాయి వచ్చింది- ప్రభుత్వ అధికారులకే టొకరా వేసిన కేటుగాళ్లు

Crime News: అనంతపురం సమగ్ర శిక్షణ సంస్థ సిబ్బంది మోసపోయారు..కొరియర్ సంస్థ తీసుకొచ్చిన కవర్‌ విప్పి చూడగా ల్యాప్‌టాప్‌కు బదులు బండరాయి కనిపించడంతో అవాక్కయ్యారు

Andhra Pradesh Crime News: కొరియర్ సంస్థలు ద్వారా జరుగుతున్న మోసాలు ఈ మధ్య కాలంలో భాగా పెరిగిపోయాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా కొరియర్(Courier) సంస్థలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ సంస్థల్లో పనిచేస్తున్న కొందరి సిబ్బంది కారణంగా  సంస్థకే చెడ్డపేరు వస్తోంది. విలువైన వస్తువులను మాయం చేసి వాటి స్థానంలో రాళ్లు, ఇటుకలు పెట్టి కస్టమర్లకు అందిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

ల్యాప్‌టాప్‌కు బదులు బండరాయి
ల్యాప్‌టాప్‌(Laptop) కోసం కొరియర్ కవర్‌ విప్పి చూస్తే...బండరాయి కనిపించడంతో సమగ్ర శిక్షణ కార్యాలయం సిబ్బంది విస్తుపోయారు. రాష్ట్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల సమగ్ర శిక్షణ డీసీపీ(DCP), ఏపీసీ(APC)లకు కొరియర్‌లో ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ఇండియా అనే కంప్యూటర్ సంస్థ ఈ ల్యాప్‌టాప్‌లను కొరియర్ ద్వారా పంపింది. అయితే అనతంపురం డీసీపీగా ఉన్న డీఈవో సహా మిగిలిన వారికి  మే 31న  ల్యాప్‌టాప్‌లు కొరియర్ ద్వారా వచ్చాయి. డీఈవో(DEO)  కొరియర్ కవర్ తెరిచి చూడగా ల్యాప్‌టాప్ ఉంది. అయితే ఏపీసీకి వచ్చిన ల్యాప్‌టాప్(Laptop) కవరు ఓపెన్ చేయలేదు. ఈ క్రమంలో రాష్ట్ర సమగ్ర శిక్షణ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. జిల్లాకు పంపిన రెండు ల్యాప్‌టాప్‌ల్లో ఒకటి అందుకున్నారని సమాచారం వచ్చిందని... రెండోదాని సంగతి ఏంటని ప్రశ్నించారు. దీంతో ఏపీసీ(APC) పార్శిల్ ఓపెన్ చేసి చూడగా అందులో బండరాయి దర్శనమివ్వడంతో ఆయన అవాక్కయ్యారు. 

విలువైన ల్యాప్‌టాప్ మాయం
హెచ్‌పీ కంపెనీకి చెందిన 12 జనరేషన్, 16 జీబీ ర్యామ్, 1టీబీ ఎస్‌ఎస్‌డీ, స్క్రీన్‌ విండోస్‌ 11 ప్రో, ఎంఎస్‌ ఆఫీస్‌ అడాప్టర్‌ క్యారీ కేస్‌ సామర్థ్యం కల్గిన అత్యంత ఖరీదైన ల్యాప్‌టాప్‌లను సమగ్ర శిక్షణ సంస్థ కొనుగోలు చేసింది. వీటిని అన్ని జిల్లాలకు కొరియర్ ద్వారా పంపిణీ చేసింది. కానీ అనంతపురం(Anathapuram) ఏపీసీకి పంపించిన కొరియర్‌లో బండరాయి రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పైగా ఆ రాయికే కవర్లు కప్పి ఉంచడంతోపాటు ల్యాప్‌టాప్ ఎంత బరువు  అయితే ఉంటుందో అంతే బరువు ఉన్న రాయిని ఉంచారు.  అయితే, ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర కార్యాలయ అధికారుల దృష్టికి స్థానిక సిబ్బంది తీసుకెళ్లారు. ల్యాప్‌టాప్‌(Laptop) పార్శిల్‌ కవరుపై ఉన్న కంప్యూటర్‌ ఇండియా సంస్థ ఫోన్‌ నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

మోసం ఎక్కడ జరిగింది
అయితే ల్యాప్‌టాప్ ఎక్కడ మాయమైందో తెలియడం లేదు. ఇండియా సంస్థలోని సిబ్బందే చేతివాటం ప్రదర్శించి రాయిని కవర్‌లో పెట్టి పంపారా.? లేక కొరియర్ సంస్థలో చేతులు మారిందా లేక కొరియర్ సిబ్బంది ల్యాప్‌టాప్ దొంగిలించి అందులో రాయినిపెట్టరా తేలాల్సి ఉంది. ఇటీవల చాలాచోట్ల కొరియర్ బాయ్స్‌ చేతివాటం ప్రదర్శిస్తూ...విలువైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు మాయం చేస్తూ...వాటిస్థానంలో రాళ్లు, ఇటుకలు పెట్టి ఇస్తున్నారు. ఇది కూడా అదే విధంగా చోటుచేసుకుని ఉంటుందని సిబ్బంది అనుమానిస్తున్నారు. అయితే విలువైన వస్తువులు పార్శిల్ ద్వారా వచ్చినప్పుడు వారి ముందే ఆ పార్శిల్ ఓపెన్ చేసుకుని వస్తువులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పదేపదే అవగాహన కల్పిస్తున్నా....సమగ్ర శిక్షణ సంస్థ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగింది. 

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget