అన్వేషించండి

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం, నిశ్చితార్థానికి వెళ్తుండగా బస్సు బోల్తా, 10మందికి గాయాలు!

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఐతేపల్లి సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.

Chittoor Accident: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్(Bhakarapeta) రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) మరవకముందే అదే జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది.  నిశ్చితార్థానికి వెళ్లుండగా ఐతేపల్లి సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది. ట్రాక్టర్(Tractor) ను ఢీ కొని పక్కనే ఉన్న మామిడి తోటలో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మరో‌ 17 మందికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను తిరుపతి(Tirupati) రుయా ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా రాజంపేట నుంచి దామలచెరువు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐతేపల్లి నుంచి దామలచెరువులో నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు ఐతేపల్లి, తిరుపతి చింతలచేనుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులోపెళ్లి బృందం బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా తిరుపతికి వెళ్తుండగా మలుపు వద్ద ప్రైవేట్ బస్సులో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. మొదట ఆరుగురు చనిపోగా, నారావారిపల్లె పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొదుతూ చిన్నారి చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య 8 కి పెరిగింది. తాజాగా మరో వ్యక్తి చనిపోయారు.

బస్సులో మొత్తం 50 మంది వరకు ప్రయాణిస్తుండగా.. పెళ్లి కొడుకుతో పాటు 45 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రైవేట్ బస్సు లోయలో పడ్డ ఈ ప్రమాదంలో డ్రైవర్‌ నబీ రసూల్‌, మలిశెట్టి వెంగప్ప (60), మలిశెట్టి గణేశ్‌ ‍‌(40), మలిశెట్టి మురళి (45), కాంతమ్మ (40),  జె.యశస్విని(8), ట్రావెల్స్ క్లీనర్‌ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి 

ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫంక్షన్‌కు వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందజేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
Embed widget