అన్వేషించండి

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం, నిశ్చితార్థానికి వెళ్తుండగా బస్సు బోల్తా, 10మందికి గాయాలు!

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఐతేపల్లి సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.

Chittoor Accident: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్(Bhakarapeta) రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) మరవకముందే అదే జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది.  నిశ్చితార్థానికి వెళ్లుండగా ఐతేపల్లి సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది. ట్రాక్టర్(Tractor) ను ఢీ కొని పక్కనే ఉన్న మామిడి తోటలో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మరో‌ 17 మందికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను తిరుపతి(Tirupati) రుయా ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా రాజంపేట నుంచి దామలచెరువు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐతేపల్లి నుంచి దామలచెరువులో నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు ఐతేపల్లి, తిరుపతి చింతలచేనుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులోపెళ్లి బృందం బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా తిరుపతికి వెళ్తుండగా మలుపు వద్ద ప్రైవేట్ బస్సులో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. మొదట ఆరుగురు చనిపోగా, నారావారిపల్లె పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొదుతూ చిన్నారి చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య 8 కి పెరిగింది. తాజాగా మరో వ్యక్తి చనిపోయారు.

బస్సులో మొత్తం 50 మంది వరకు ప్రయాణిస్తుండగా.. పెళ్లి కొడుకుతో పాటు 45 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రైవేట్ బస్సు లోయలో పడ్డ ఈ ప్రమాదంలో డ్రైవర్‌ నబీ రసూల్‌, మలిశెట్టి వెంగప్ప (60), మలిశెట్టి గణేశ్‌ ‍‌(40), మలిశెట్టి మురళి (45), కాంతమ్మ (40),  జె.యశస్విని(8), ట్రావెల్స్ క్లీనర్‌ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి 

ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫంక్షన్‌కు వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందజేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
Tollywood Director Arrest : హీరోయిన్‌పై లైంగిక వేధింపులు? - టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!?
హీరోయిన్‌పై లైంగిక వేధింపులు? - టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!?
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!

వీడియోలు

CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
Panchadarla Konda: పంచదార్ల కొండకు మైనింగ్ ముప్పు నుంచి విముక్తి! నో మైనింగ్ జోన్‌గా ప్రకటించిన ఏపీ సర్కారు!
పంచదార్ల కొండకు మైనింగ్ ముప్పు నుంచి విముక్తి! నో మైనింగ్ జోన్‌గా ప్రకటించిన ఏపీ సర్కారు!
Nepal Floods: నేపాల్ వరదలకు అణు బాంబులాంటి మంచు ముక్కే కారణం! భవిష్యత్‌లో మరిన్ని ఘటనలు!
నేపాల్ వరదలకు అణు బాంబులాంటి మంచు ముక్కే కారణం! భవిష్యత్‌లో మరిన్ని ఘటనలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
HPV Vaccination : HPV వ్యాక్సిన్ పెద్దయ్యాక కాదు.. చిన్న వయసులోనే వేయించాలి.. తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయాలివే
HPV వ్యాక్సిన్ పెద్దయ్యాక కాదు.. చిన్న వయసులోనే వేయించాలి.. తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయాలివే
MS Dhoni CSK Stake: సీఎస్‌కేలో ధోనీకి 25 శాతం వాటా రూమ‌ర్స్ ... ఆకాష్ చోప్రా క్లారిటీ!
సీఎస్‌కేలో ధోనీకి 25 శాతం వాటా రూమ‌ర్స్ ... ఆకాష్ చోప్రా క్లారిటీ!
Dravid-Sehwag Young Cricket Legacy: టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
Embed widget