అన్వేషించండి

Chittoor News : టెన్త్ పేపర్ల లీకేజీ కేసు, నారాయణపై పెట్టిన సెక్షన్లు ఇవే!

Chittoor News : పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారంలో కోర్టు మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేసిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.

Chittoor News : పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల మాజీ అధినేత నారాయణకు చిత్తూరు జిల్లా న్యాయస్థానం బెయిల్ రద్దు చేసిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2022వ సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు నాల్గో అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల సమయంలో నేల్లెపల్లి జడ్పీ హైస్కూల్ లో తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 27వ తేదిన Cr. No. 111/2022 u/s 5 r/w 8, 10 కింద 408, 409, 201, 120 –B IPC & Sec. 65 of IT Act of Chittoor I Town P.S.  కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, నారాయణ విద్యా సంస్థలలో పని చేసే సిబ్బంది 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.  అయితే ఈ కేసులో మే 10న నారాయణ విద్యా సంస్థల మాజీ అధినేత పి. నారాయణను అరెస్టు చేసిన చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు జడ్జి ఎదుట హాజరు పరచారని, కేసు దర్యాప్తును పరిశీలించిన జడ్జి  నారాయణతకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారని తెలియజేశారు. 

బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు 

ఈకేసులో మిగిలిన ఎనిమిది మంది ముద్దాయిలను రిమాండ్ కు తరలించామని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నారాయణ బెయిల్ రద్దుపై పోలీసులు 9వ అదనపు న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేసి వాదనలు వినిపించారన్నారు. ఈ వాదనలపై  విచారణ జరిపిన 9వ అదనపు న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ 4వ అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారన్నారు. అయితే నవంబర్ 30వ తారీఖు లోపు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా గిరిధర్ రెడ్డి ఉండగా, సుధాకర్, మోహన్ బాబు,అరీఫ్ బాషా, సురేష్ బాబు, పవన్ కుమార్, గంగాధర్ రావు, నారాయణలు ముద్దాయిగా ఉన్నట్లు చిత్తూరు ఎస్పి రిశాంత్ రెడ్డి తెలియజేశారు. 

చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో పేపర్లు 

 ప్రతి ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్లో ర్యాంకుల కోసం ప్రైవేటు యాజమాన్యాలు పోటీ పడుతుంటారు. ఎలాగైనా తమ కళాశాల విద్యార్థులు అధిక శాతం మార్కులు సాధించి నెంబర్ వన్ లో నిలవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెండేళ్ల తరువాత ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు అధిక మార్కులు సాధించాలని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అడ్డదారిలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ పేపర్ల ఫొటోలు తీసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో పోస్టు చేశారు. ఈ ఘటనపై చిత్తూరు డీఈవోకి అందిన ఫిర్యాదుతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు మాల్ ప్రాక్టీసుకు కారకుడైన నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget