అన్వేషించండి

Kuppam News : పొలం దారి సమస్య, సచివాలయంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం!

Kuppam News : పొలానికి దారి సమస్య పరిష్కరించడంలేదని సచివాలయంలో మాజీ సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం చేశారు.

Kuppam News : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల సచివాలయంలో టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశారు.  చెంగుబళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్ తన పొలానికి దారి సమస్య పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మండల రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించారు. వినతులు స్వీకరించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని గోపాల్ ఆరోపిస్తున్నారు. వారం రోజుల కిందట రెవెన్యూ డివిజన్ అధికారికి విన్నవించిన గోపాల్.. ఆర్డీవో కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం క్షేత్ర పరిశీలన చేపట్టిన అధికారులు సమస్యను మాత్రం పరిష్కరించలేదు.  దీంతో అధికారుల తీరుపై ఆవేదన చెందిన గోపాల్..  సచివాలయంలో తాడుతో ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు. 

లాడ్జ్ లో యువతి, యువకుడు సూసైడ్ 

తిరుపతిలోని ఓ లాడ్జ్ లో  యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందరాజస్వామి ఆలయ ఉత్తరమాడవీధిలోని ఓ ప్రైవేట్‍ లాడ్జ్ కు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో యువతి, యువకుడు వచ్చారు. లడ్జ్ లో రూమ్ తీసుకున్న వీరిద్దరూ 24 గంటలు గడిచినా బయటకు రాకపోవడంతో లాడ్జ్  నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరూ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం  మృతులు హైదరాబాద్ కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

వేటగాళ్లు అరెస్టు 

చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి వేటగాళ్ల ఆగడాలు హద్దులు మీరుతున్నాయి. అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులను సంహరించి పైశాచికత్వంను పొందుతున్నారు. తాజాగా కినాటకంపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులిని నాటు తుఫాకీతో వేటాడిన వేటగాళ్లు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో రంగంలోకి దిగిన చిత్తూరు అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను సంహరించే ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారిపై అటవీ శాఖ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. నిందుతుల వద్ద నుండి చిరుత పులి గోర్లు, రెండు నాటు తుఫాకీలు, మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఫారెస్టు డిఏఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా, యాదమర్రి మండలం, కినాటంపల్లె అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రితం చిరుత పులిని కొందరు వ్యక్తులు వేటాడి సంహరించిన ఫోటోలు గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, తీగ లాగితే డొంక కదిలినట్లు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను సంహరించే ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు ఫారెస్టు డిఏఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget