అన్వేషించండి

Chittoor Crime : అమ్మ ప్లాన్ అమలు చేసిన తనయుడు, అరెస్ట్ చేసిన పోలీసులు!

Chittoor Crime : చిత్తూరు జిల్లాలో జరిగిన దారి దోపిడీని పోలీసులు ఛేదించారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలను పోలీసులు గుర్తించారు. దోపిడీ ప్లాన్ కు ప్రధాన సూత్రదారి ఓ మహిళ కావడం విశేషం.

Chittoor Crime : చిత్తూరు జిల్లాలో దారి దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు చిత్తూరు ఈస్ట్ సర్కిల్ పోలీసులు. కేసీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ పీఆర్వో జాన్సన్ పై దాడి చేసి 12 లక్షల రూపాయల నగదు ఆపహరించిందో ముఠా. గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లి సమీపంలో చిత్తూరు- తర్చూరు హైవే నిర్మాణం పనులు చేస్తోంది కేసీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆగస్టు ఒకటో తేదీన కంపెనీ పీఆర్వో జాన్సన్ పై దాడి చేసిన ముఠా రూ.12 లక్షలు దోచుకెళ్లింది. నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ఉదయం నిందితులను అరెస్టు చేశారు. నిందితులు అందరూ చిత్తూరు నగరానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ముఠా లీడర్ 19 సంవత్సరాల (మక్కిని భరత్) పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి 11 లక్షల రూపాయలు నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు ముద్దాయిలు పరారైనట్లు వెల్లడించారు పోలీసులు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  

పరారీలో నలుగురు 

దారి దోపిడీకి ప్లాన్ వేసిన సూత్రదారి, భరత్ తల్లి తేజస్వినిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు అందరూ దాదాపు 20 సంవత్సరాల వయసు కలిగిన వారే అని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ విలాసాలకు అలవాటుపడి దారి దోపిడీలకు పాల్పడ్డారని వెల్లడించారు. గ్యాంగ్ లీడర్ మక్కిని భారత్ తో పాటు కె.విక్రం, తేజశ్రీ, యస్.సందీప్, జి.పవన్ కుమార్, ఎ.చరణ్ రాజ్, ఎ.లవ కుమార్, కె.పవన్ కుమార్, వి.కృష్ణలను రిమాండ్ కు తరలించారు పోలీసులు. రూపేష్, సాయి, పరంధామనాయుడు, ధనరాజ్ లు అనే మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

క్లాస్ మేట్స్ సాయంతో  

'కేసీసీ కన్స్ స్ట్రక్షన్ కంపెనీకి చెందిన పీఆర్వో వ్యాపార నిమిత్తం కొంత నగదు తీసుకెళ్తుండగా కొందరు దుండగులు అడ్డగించి దోచుకెళ్లారని ఓ ఫిర్యాదు అందింది. గంగాధర నెల్లూరు జిల్లా కాలేపల్లి సమీపంలో  దారిదోపిడీ జరిగింది. పీఆర్వో వాహనాన్ని వెంబడించిన నిందితులు మార్గమధ్యలో వాహనాన్ని అడ్డగించి సుమారు రూ.12 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై దర్యాపు చేసి నిందితులను పట్టుకున్నాం. సుమారు 11 లక్షల వరకు రికవరీ అయింది. కొంతమంది పరారీలో ఉన్నారు. చిత్తూరు చెందిన భరత్(19) అనే వ్యక్తి చెన్నైలో బీటెక్ చదువుకున్నాడు. వాహనాలను రెంట్ కు ఇస్తుంటాడు. దానికి ఓ డ్రైవర్ ను పెట్టుకుని వాహనాలను రెంట్ కు నడిపిస్తాడు. పీఆర్వో దగ్గర ఓ వాహనాన్ని రెంట్ కు పెట్టాడు భరత్. పీఆర్వో తరచూ నగదు పట్టుకెళ్లడాన్ని ఆ డ్రైవర్ భరత్ కు తెలిపాడు. దీంతో భరత్ ప్లాన్ వేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. ఇతనితో పాటు స్కూల్ మేట్స్, కాలేజీ ఫ్రెండ్స్ 10 మంది వరకు దోపిడీలో పాలుపంచుకున్నారు.' - రిశాంత్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ 

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget