అన్వేషించండి

Chittoor Crime News : ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు మిస్సింగ్, గ్రామ శివారులో మృతదేహం- అసలేమైంది?

Chittoor Crime News : రెండ్రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు, గ్రామ శివారులో ఓ చెట్టుకు విగతజీవుడిగా వేలాడుతూ కనిపించాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సమాజంలో రోజు రోజుకీ  మానవత్వం మరిచి పోతున్నారు కొందరు దుర్మార్గులు. చిన్న చిన్న కారణాలకే పసికందులను అత్యంత కిరాతకంగా హత్య(Murder) చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు కనికరం లేకుండా గ్రామం శివారులో ఓ చెట్టుకి ఉరి వేసి హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది.

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా(Chittoor District) కలికిరి మండలం ఆద్దావారిపల్లి గ్రామానికి చెందిన రవి, తులసీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. రవి చిన్న కుమారుడు ఎనిమిదేళ్ల ఉదయ్ కిరణ్ మూడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 11వ తేదీన తల్లి తులసి కలికిరిలోని బ్యాంకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా తాను వెంట వస్తానని ఉదయ్ కిరణ్ మారం చేశాడు. అందుకు తులసీ అంగీకరించకుండా ఇంటి వద్ద ఉండి చదువుకోమని చెప్పి బ్యాంకుకి వెళ్లింది. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన తులసీ, పిల్లల కోసం తీసుకొచ్చిన తినుబండారాలు ఇచ్చేందుకు ఉదయ్ కిరణ్ కోసం వెతికింది. గ్రామం అంతా వెతికినా ఉదయ్ కిరణ్ కనిపించక పోవడంతో, గ్రామస్తులకు విషయం చెప్పి గాలించినా ఫలితం లేకుండా పోయింది. 

గ్రామ శివారులో చెట్టుకు వేలాడుతూ బాలుడి మృతదేహం

మరుసటి రోజు శనివారం ఉదయం కలికిరి పోలీస్ స్టేషన్లో తన కుమారుడు కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది తులసీ. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉదయ్ కిరణ్ శవమై వేలాడుతూ ఉండటాన్ని చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి శవాన్ని దించి ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మదనపల్లి డీఎస్పీ మనోహర్ ఆచారి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్స్ స్క్వాడ్ సహాయంతో బాలుడి హత్యకు గల కారణాలు కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.‌ గుర్తు తెలియని దుండగులు బాలుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీ‌కరించేందుకు చెట్టుకు వేలాడా దీశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget