అన్వేషించండి

Chaina Manja Murder : గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?

చైనా మంజా దారం బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గొంతును కట్ చేసేసింది. దీంతో ఆ వ్యక్తి చనిపోయాడు. నిషేధం విధించినా జోరుగా చైనా మాంజాను అమ్మేస్తున్నారు. ఇప్పుడీ వ్యక్తి మరణానికి కారకులెవరు ? బాధ్యత ఎవరిది ?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే పతంగుల వేడుక నిర్వహించుకోవడం సహజమే. కానీ ఈ పండుగలోనూ చొరబడిన చైనా పక్షులకే మనుషుల పీకలనూ తేగ్గోస్తోంది. దానికి సాక్ష్యం..  సంక్రాంతి పండుగల రోజే మంచిర్యాలలో చోటు చేసుకున్న ఘటన.  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల నుండి ద్విచక్ర వాహనం పై లక్షెట్టిపేట వైపు వస్తున్న వ్యక్తికి ఎగురవేస్తున్న తెగిన గాలిపటం మాంజదారం గొంతుకు అడ్డం పడింది. సున్నితంగా గొంతును కట్ చేసుకుంటూ వెళ్లిపోయింది.   గొంతు తెగి  అతిగా రక్తస్రావం కావడం తో  వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన వసరత్ భీమయ్య గా  మృతుడ్ని గుర్తించారు. ఇది అత్యంత భయంకరమైన హత్య లాంటిదే. దీనికి కారణం చైనా మాంజానే. చైనా మాంజాను ఎప్పుడో నిషేధించారు. అయినా అక్రమంగా అమ్ముతూనే ఉన్నారు. ఇలా ప్రాణాలు పోవడానికి కారణం అవుతూనే ఉన్నారు.
Chaina Manja Murder :  గొంతులు కోస్తున్న చైనా మాంజా..  నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు !  ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?

Also Read: హేమమాలిని ప్లేస్‌లోకి కంగనా ! రాజకీయ నేతలూ బ్రాండ్ అంబాసిడర్లను మార్చేస్తారా ?

మన సంక్రాంతి..చైనాకు పతంగుల పండుగ.. !

సంక్రాంతి సందర్భంగా చైనాలో తయారవుతున్న గాలిపటాలు- పతంగ్‌లు-, వాటిని ఎగుర వేయడానికి అవసరమైన చైనా దారం  మాంజా వెల్లువలా దిగుమతి అవుతూ ఉంటాయి. చైనానుంచి వస్తున్న ప్లాస్టిక్ దారం పక్షుల గొంతులను పావురాల గొంతులను కోస్తోందని 2013నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ దారం తగిలి గాయపడిన బాలబాలికలకు నెలల తరబడి ఆ పుండ్లు మానడం లేదని తేలింది. చైనా మాంజా దారంతో గాలిపటాలు బాగా ఎగురవేయవచ్చన్న ఉద్దేశంతో జనం ఎగబడి కొంటున్నారు. ఈ ప్లాస్టిక్ చైనా దారంలో గాజుముక్కలను ఇతర రసాయన విషాలను కలుపుతున్నారు! అందువల్ల ఈ దారం కత్తిలాగా మారుతోంది. "పతంగ్"లను ఎగురవేసేవారు  మిగిలినవారి గాలి పటాలకంటె ఎత్తున ఎగరాలని భావింస్తూంటారు.  పోటీపడి పైకి లేచే ఇతరుల గాలిపటాలను కూల్చివేయడం ఆటలో భాగమైపోయింది. అందుకే చైనా మాంజాను కొనేందుకు కొంత మంది ఆసక్తి చూపిస్తున్నారు.

Chaina Manja Murder :  గొంతులు కోస్తున్న చైనా మాంజా..  నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు !  ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?

Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !

ఆరేళ్ల క్రితమే చైనా మాంజా నిషేధం !

 2016 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా వాడకాన్ని, అమ్మకాన్ని, నిలువ ఉంచడాన్ని నిషేధించింది. ఈ దారం వల్ల పక్షులు, పావురాలు బలికావడం, బాలబాలికలు గాయపడడం నిజమని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఆ తరువాత అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ ఈ దారాన్ని నిషేధించాయి. 2017 జూలైలో  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి దేశవ్యాప్తంగా చైనా మాంజాను నిషేధించింది. కానీ ప్రతి  ఏడాది మకర సంక్రాంతికి ముందు మాంజాతోపాటు గాలిపటాలు కూడ చైనానుండి వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యవస్థలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
Chaina Manja Murder :  గొంతులు కోస్తున్న చైనా మాంజా..  నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు !  ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?

Also Read: ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?

 
ఎన్నో విషాదాలు .. అయినా మేల్కొనని యంత్రాంగం 

చైనా మాంజాను  ప్లాస్టిక్‌ దారానికి గాజుపొడి అద్ది తయారు చేయటంతో గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవటంతో పాటు చెట్లకు, కరెంట్ పోల్స్ లకు చిక్కుకోవటంతో చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి.  అంతేకాదు..రోడ్లపై బైక్ లపై వెళ్లేవారికి గాల్లో వేలాడుతు వచ్చిన ఈ మాంజాతో గొంతుకలు కట్ అయిపోయిన సందర్భాలు కూడా చాలానే జరిగాయి. ఈ క్రమంలో మనుషుల ప్రాణాలకు కూడా ముప్పుగా ఈ చైనా మాంజా వుంది. మంచిర్యాలలో అదే జరిగింది. గతంలో ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి కుమారుడికి ఇలాంటి ప్రమాదం జరగడంతో అతడు కోర్టు పిటీషన్ వేసిన ప్రమాదానికి కారణాలను కోర్టు సబ్మిట్ చేశాడు. ఈ పిటీషన్ పై విచారించిన కోర్టు చైనా మాంజా నిషేధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ చైనా మాంజా వినియోగంతో పక్షలు, జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదంగా తయారయ్యింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి చైనా మంజాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా వుంది. ఎన్ని న్యాయస్థానాలు ఆదేశించినా పట్టించుకోకపోవడంతో  పక్షులే కాదు.. మనుషుల ప్రాణాలు కూడాపోతున్నాయి. 

Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Embed widget