అన్వేషించండి

Anantapur Crime : ఒకే దెబ్బకు అప్పు, భర్త రెండూ ఫినిష్ - ప్రియుడి మోజులో భార్య మాస్టర్ ప్లాన్!

Anantapur Crime : వివాహేతర సంబంధం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో అన్న, అల్లుడి సాయంతో భర్తను హత్య చేయించింది మహిళ. ధర్మవరంలో ఈ కేసు సంచలనం అయింది.

Anantapur Crime :వివాహేతర సంబంధాలతో కుటుంబాలు కుప్పకూలుతూనే ఉన్నాయి. ఇటీవల ధర్మవరంలో ఏప్రిల్ ఎనిమిదో తేదీన గంగాధర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. దీనిని కాల్ మనీ హత్యగా అందరూ భావించారు. గంగాధర్ ను వడ్డీ వ్యాపారులు హత్య చేశారంటూ భార్య పల్లపు లక్ష్మిదేవీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇది కాల్ మనీ మర్డర్ అంటూ ధర్మవరంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ మొదలుపెట్టారు. కానీ పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ హత్యకు కాల్ మనీకు సంబంధం లేదని తేల్చారు. భార్యే ఇంతటి దారుణానికి పాల్పడిందన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా అంతకన్నా దారుణం ఏంటంటే ఈ హత్యకు నిందితురాలి అన్న, అల్లుడు పాల్పడిన షాకింగ్ విషయాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి. 

ఏం జరిగిందంటే? 

అనంతపురం జిల్లా ధర్మవరంలో పల్లపు లక్ష్మిదేవి, గంగాధర్ కుటుంబం ఉండేది. గంగాధర్ వడ్డీ వ్యాపారుల వద్ద దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయలు అప్పులు చేశాడు. ఈ అప్పుల్నే అతడి భార్య హత్యకు కారణంగా వాడుకుంది. అతడి భార్య లక్ష్మిదేవి ధర్మవరంలోని తారకరామాపురానికి చెందిన భాస్కర్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో భార్య లక్ష్మిదేవి దారుణమైన పన్నాగం పన్నింది. హత్య చేసి వడ్డీ వ్యాపారుల ఖాతాలోకి వేస్తే అప్పుకు అప్పు, అడ్డుగా ఉన్న భర్త ఇద్దరి పీడ విరగడ అవుతుందని ప్లాన్ చేసింది. అనుకున్నదే తడువుగా తన అన్న గొడ్డెండ్ల వెంకటేష్, అల్లుడు(కూతురి భర్త) బండారు సుధాకర్ తో మాట్లాడింది. ఈ హత్య చేసేందుకు సుపారీ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో నిందితులు ఏప్రిల్ ఎనిమిదో తేదీన ధర్మవరంలోని ఎల్పీ కూడలి వద్ద ఉన్న రైల్వే పార్క్ లో గంగాధర్ ను  దారుణంగా హత్య చేసి పరారయ్యారు. 

కాల్ మనీ హత్యగా క్రియేట్ 

ఈ కేసులో మృతుడి భార్య పోలీసులను తప్పుదోవ పట్టించింది. తన భర్తను వడ్డీవ్యాపారులే హత్య చేశారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ధర్మవరంలో ఇలాంటి ఘటనలు జరగడంతో మీడియా కూడా పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించింది. దీంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులకు విచారణలో నిందితురాలు లక్ష్మిదేవికి ఉన్న అక్రమ సంబంధం, సాంకేతికత ఆధారంగా ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేసేసరికి నిందితులు తాము చేసిన దారుణాన్ని ఒప్పుకొన్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో కట్టుకున్న భార్య, ఆమె కుటుంబ సభ్యులు హత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సంచలనంగా మారిన కేసులో పోలీసులు వ్యూహాత్మకంగా సాంకేతికతను ఉపయోగించి ఛేదించడంతో ధర్మవరం పోలీసులను అభినందించారు సత్యసాయి జిల్లాఎస్పీ రాహుల్ దేవ్ సింగ్. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget