అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
2008 Serial Blast Case: 38 మందికి మరణ శిక్ష- అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో కోర్టు సంచలన తీర్పు
Ahmedabad Serial Blast Case 2008: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది గుజరాత్ ప్రత్యేక కోర్టు.
![2008 Serial Blast Case: 38 మందికి మరణ శిక్ష- అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో కోర్టు సంచలన తీర్పు 2008 Ahmedabad serial bomb blast case special court pronounces death sentence to 38 out of 49 convicts 2008 Serial Blast Case: 38 మందికి మరణ శిక్ష- అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో కోర్టు సంచలన తీర్పు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/788c117d5394bf116461553fd3e1d515_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషులకు గుజరాత్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంతమందికి ఒకేసారి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. మరో 11 మందికి జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో మొత్తం 77 మందిని విచారించారు. గత ఏడాది సెప్టెంబర్లో ఈ కేసు విచారణ ముగిసింది. అయితే పలు వాయిదాల తర్వాత ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షను ఈరోజు ఖరారు చేసింది.
వరుస పేలుళ్లు
2008లో ఉగ్రవాదులు అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. జులై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)తో సంబంధమున్న మూకలే ఈ బాంబు దాడులకు పాల్పడ్డాయని దర్యాప్తు వర్గాలు తేల్చాయి.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)