అన్వేషించండి

Mobile Tariff Hike In 2023: మొబైల్‌ మాటలు మరింత ఖరీదు కావచ్చు, రేట్ల పెంపునకు రెడీగా ఉన్న టెలికాం కంపెనీలు

అటు ప్రి-పెయిడ్ - ఇటు పోస్ట్‌ పెయిడ్ ఇలా రెండు రూపాల్లోనూ ధరల పెంపును కాల్‌ ప్రొవైడర్లు ప్రకటించవచ్చని అంచనాలు ఉన్నాయి.

Mobile Tariff Hike In 2023: దేశంలో మొబైల్ సేవలు అందిస్తున్న ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా) కొత్త ఏడాదిలో టారిఫ్‌లు పెంచేందుకు సిద్ధంగా కనిపిస్తున్నాయి. దేశంలో 5G టెలికాం సర్వీసులను (5G Service) అందించడానికి... స్పెక్ట్రం కొనుగోలు, సంబంధిత సాంకేతికత కోసం లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ఈ టెలికాం సంస్థలు వెచ్చిస్తున్నాయి. ఈ డబ్బులను భారత ప్రభుత్వానికి చెల్లించేందుకు, పనిలో పనిగా తాము కూడా లాభాల్లో కొనసాగేందుకు కాల్‌ రేట్లను పెంచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈసారి, అటు ప్రి-పెయిడ్ - ఇటు పోస్ట్‌ పెయిడ్ ఇలా రెండు రూపాల్లోనూ ధరల పెంపును కాల్‌ ప్రొవైడర్లు ప్రకటించవచ్చని అంచనాలు ఉన్నాయి.

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్ నివేదిక
బ్రోకరేజ్ హౌస్ ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్ (IIFL Securities), టెలికాం టారిఫ్స్‌ పెంపు మీద ఒక నివేదికను విడుదల చేసింది. 5Gతో అనుబంధానమైన 'ఒక్కో వినియోగదారు సగటు ఆదాయాన్ని' (Average Revenue Per User - ARPU) తక్షణం పెంచుకోవడం టెలికాం కంపెనీలకు కుదిరే పని కాదు. కాబట్టి, 4G టారిఫ్‌లను పెంచడం తప్ప వేరే వాటికి మార్గం లేదు. 2024లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు సమీపంలో... అంటే 2023 చివరిలో, లేదా 2024 ప్రారంభంలో టారిఫ్‌లను పెంచడం వల్ల రాజకీయ ఆరోపణలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. కాబట్టి, 2023 మధ్య కాలంలోనే 4G టారిఫ్‌ల పెంపును ప్రజలు భరించాల్సి వస్తుందని బ్రోకింగ్‌ హౌస్ విశ్వసిస్తోంది.

తన రుణాన్ని వొడాఫోన్ ఐడియా తిరిగి చెల్లించడానికి కనీసం 25 శాతం టారిఫ్‌ను పెంచాల్సి ఉంటుందని, అలాగే, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను 2027 నాటికి క్లియర్ చేయడానికి టారిఫ్‌ను భారీగా పెంచాల్సి ఉంటుందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ (Kotak Institutional Equities) కూడా తన నివేదికలో పేర్కొంది. పోస్ట్‌ పెయిడ్ టారిఫ్‌లు కూడా పెరిగే అవకాశం ఉందని ఈ బ్రోకరేజ్ హౌస్ అభిప్రాయపడింది.

కొన్ని రోజుల క్రితమే, భారత్‌లో టెలికాం టారిఫ్‌ల మీద విదేశీ బ్రోకరేజ్ హౌస్ జెఫరీస్‌లోని (Jefferies) విశ్లేషకులు కూడా ఒక నివేదిక విడుదల చేశారు. టెలికాం కంపెనీలు కొత్త సంవత్సరంలో మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచవచ్చని ఆ నివేదికలో వాళ్లు వెల్లడించారు. 2020-23, 2023-24, 2024-25 నాలుగో త్రైమాసికాల్లో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచవచ్చని తెలిపారు. 5G పెట్టుబడుల కారణంగా కంపెనీల ఆదాయం, మార్జిన్ల మీద మళ్లీ ఒత్తిడి పెరుగుతోందని, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి టారిఫ్‌లు పెంచడం తప్ప టెలికాం కంపెనీలకు మరో మార్గం లేదని నివేదికలో పేర్కొన్నారు.

రిలయన్స్ జియో (Reliance Jio), భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel) దేశంలోని అనేక నగరాల్లో ఇప్పటికే 5G సేవలను ప్రారంభించాయి. వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) ఇంకా ప్రారంభించలేదు. ఈ 3 టెలికాం కంపెనీలు 5G స్పెక్ట్రం కోసం వేలంలో రూ. 1,50,173 కోట్లు వెచ్చించాయి. ఈ లైసెన్స్ ఫీజును చెల్లించేందుకు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.