అన్వేషించండి

GST on Salary: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్‌ పిరియడ్‌ సర్వ్‌ చేయకుంటే పన్ను పడతాది!

నోటీస్‌ పిరియడ్‌ సర్వ్ చేయకుండానే వెళ్లిన ఉద్యోగి నుంచి రికవరీ చేసే మొత్తంపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని AAR ఆదేశించింది. నోటీస్‌ పే, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ వర్తిస్తుందని వెల్లడించింది.

వేరే కంపెనీలో ఉద్యోగం దొరికిందా? ఎక్కువ ప్యాకేజీకి వెళ్తున్నారా? పాత సంస్థలో నోటీస్‌ పిరియడ్‌ పూర్తి కాకుండానే వెళ్లిపోతున్నారా? అయితే ఇకపై మీరు 18 శాతం వరకు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

కొవిడ్‌ తర్వాత ఐటీ, ఐపీ ఆధారిత రంగాల్లో ఉద్యోగ మార్పిడీ రేటు చాలా పెరిగింది. మెరుగైన వేతనాలు లభిస్తుండటం, నిపుణుల కొరత ఉండటంతో ఉద్యోగులు వేరే కంపెనీలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నోటీస్‌ పిరియడ్‌ సర్వ్ చేయకుండానే వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగి నుంచి రికవరీ చేసే మొత్తంపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అడ్వాన్స్‌ అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (AAR) ఆదేశాలు జారీ చేసింది. నోటీస్‌ పే, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, టెలిఫోన్‌ బిల్లులపై జీఎస్‌టీ వర్తిస్తుందని వెల్లడించింది.

భారత్‌ పెట్రోలియానికి చెందిన భారత్‌ ఒమన్‌ రిఫైనరీస్‌ కంపెనీ కేసులో ఏఏఆర్‌ ఈ తీర్పునిచ్చింది. దీంతో ఇకపై నోటీస్‌ పిరియడ్‌ సర్వ్‌ చేయకుండా వెళ్లే ఉద్యోగులు తీసుకున్న వేతనంపై వస్తు సేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నోటీస్‌ సమయంలో ఉద్యోగికి కంపెనీ సేవలను అందుకుంటున్నట్టుగా భావించాల్సి ఉంటుందని, అలాంటి లావాదేవీలపై పన్ను పడుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజీనామా చేసి వెళ్లిపోయే ముందు తీసుకుంటున్న నగదుపై పన్ను శాఖ మరింత పర్యవేక్షణ చేయబోతోందని తెలిసింది.

2020, జులైలోనూ అమ్‌నియల్‌ ఫార్మాసూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అహ్మదాబాద్‌ కేసులో గుజరాత్‌ ఏఏఆర్‌ ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. లావాదేవీలు సేవల కిందకు వస్తాయి కాబట్టి నోటీస్‌ పిరియడ్‌ సర్వ్‌ చేయని ఉద్యోగి నుంచి రికవరీ చేసిన మొత్తంపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలని ఆదేశించింది.

Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?

Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది

Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..

Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, మరింత పడిపోయిన వెండి.. నేటి ధరలివే..

Also Read: Petrol-Diesel Price, 1 December: గుడ్‌న్యూస్, ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ మాత్రం పెరుగుదల.. తాజా రేట్లు ఇవీ..

Also Read: Star Health IPO: స్టార్‌ హెల్త్‌ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kakani Govardhan: కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
Kancha Gachibowli Land Dispute: కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
Nagarjuna Sagar Project Controversy : నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడుShubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kakani Govardhan: కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
Kancha Gachibowli Land Dispute: కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
Nagarjuna Sagar Project Controversy : నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
BRS Leader Shakeel Arrest: పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
Chebrolu Kiran Kumar: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
Trump Tariffs: 'పాజ్‌' బటన్‌ నొక్కడంలో ట్రంప్‌ ప్లాన్‌ ఏంటి, మిగతా ప్రపంచాన్ని ఎందుకు ఒదిలిపెట్టాడు?
'పాజ్‌' బటన్‌ నొక్కడంలో ట్రంప్‌ ప్లాన్‌ ఏంటి, మిగతా ప్రపంచాన్ని ఎందుకు ఒదిలిపెట్టాడు?
Embed widget