By: ABP Desam | Updated at : 25 Aug 2021 07:13 AM (IST)
పెట్రోల్, డీజిల్ తాజా ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో కొద్ది రోజులుగా మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటుండగా.. హైదరాబాద్లో మాత్రం కొద్ది రోజులుగా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్లో రూ.0.15 పైసలు తగ్గగా.. డీజిల్ ధర రూ.0.16 పైసలు దిగువకు చేరింది.
తెలంగాణలో ఆగస్టు 25న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.54 కు తగ్గగా.. డీజిల్ ధర కూడా రూ.96.99 గా ఉంది. కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.14 పైసలు తగ్గింది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్లో రూ.105.72గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.0.15 పైసలు పెరిగి రూ.97.15 గా అయింది.
ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.06 కాగా.. డీజిల్ ధర రూ.96.53 గా ఉంది. పెట్రోల్ రూ.0.14 పైసలు పెరగ్గా.. డీజిల్ రూ.0.16 పైసల చొప్పున పెరిగింది. కొద్దిరోజులుగా వరంగల్లో నిలకడగా ఉంటున్న ధరలు తాజాగా స్వల్పంగా తగ్గాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.
నిజామాబాద్లో పెట్రోల్ ధరలో లీటరుకు సుమారు రూ.0.35 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.30 పైసలు పెరిగింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.66 గా ఉంది. డీజిల్ ధర రూ.98.96గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో ఇంధన ధరల్లో అతి స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.03 చొప్పున స్వల్పంగా తగ్గగా.. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.107.88 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.05 పైసలు తగ్గి రూ.98.82కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.15గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే రూ.0.28 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.23 పైసలు పెరిగి రూ.98.09గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో భారీ మార్పు
తిరుపతిలో ఇంధన ధరల్లో కొద్ది రోజులుగా భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. కానీ, తాజాగా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటరుకు రూ.0.54 పెరగ్గా.. డీజిల్ రూ.0.48 పైసలు పెరిగింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.62కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.99.46గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 25 నాటి ధరల ప్రకారం 67.35 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు
SIM Card Rules: కొత్త సిమ్ తీసుకోవాలంటే కొత్త రూల్స్, ఇకపై ట్రిక్స్ పని చేయవు
Tax Exemption: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి
Share Market Opening Today: స్మాల్ బ్రేక్ తీసుకున్న స్టాక్ మార్కెట్ - 69700 దిగువన సెన్సెక్స్, రెడ్ జోన్లో నిఫ్టీ
Latest Gold-Silver Prices Today: మళ్లీ పెరిగిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>