![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Petrol-Diesel Price, 12 October: మళ్లీ షాక్! నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..
విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు తాజాగా కాస్త ఎక్కువగానే పెరిగాయి. ప్రస్తుతం రూ.110.63 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.24 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.103.05కు చేరింది.
![Petrol-Diesel Price, 12 October: మళ్లీ షాక్! నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు.. నేడు మీ నగరంలో ఇలా.. Petrol Diesel Price Today 12 October 2021 know rates fuel price in your city Telangana Andhra Pradesh Amaravati Hyderabad Petrol-Diesel Price, 12 October: మళ్లీ షాక్! నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/862a035e414ba7fc945bc78bf595d055_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొద్ది రోజులుగా ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరింతగా పెరిగాయి. హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.31 పైసలు పెరిగి రూ.108.64 అయింది. రూ.101.27 గా ఉన్న డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.101.66కి చేరింది. ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.39 పైసలు పెరిగి రూ.108.41గా ఉంది. డీజిల్ ధర రూ.0.45 పైసలు పెరిగి రూ.101.43 గా ఉంది. వరంగల్లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.60 పైసలు పెరిగి.. రూ.108.81గా ఉంది. డీజిల్ ధర రూ.0.65 పైసలు పెరిగి రూ.101.80 కు చేరింది. నిజామాబాద్లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.04 పైసలు పెరిగి రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.13 పైసలు పెరిగి రూ.103.00 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు తాజాగా కాస్త ఎక్కువగానే పెరిగాయి. ప్రస్తుతం రూ.110.63 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.24 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.103.05కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.50గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.74 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.101.97గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.60 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.27 పైసలు తగ్గి.. రూ.110.33 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా తాజాగా తగ్గింది. ఇక డీజిల్ ధర రూ.102.77గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.14 పైసలు తగ్గింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 12 నాటి ధరల ప్రకారం 81.18 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్
Also Read: Medak: మెదక్లో నీచం.. భార్యకి, కొడుక్కీ ఒక అబ్బాయే లవర్.. రోజూ అదే పని.. చివరికి ఇంట్లో ఘోరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)