search
×

EPFO E-Nomination: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ - 2 రోజుల్లో E-నామినేషన్ చేయకపోతే ఆ బెనిఫిట్స్ కోల్పోతారు

Provident Fund E-Nomination: మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోలేదా.. 2 రోజుల్లో E-నామినేషన్ చేయకపోతే ఆ బెనిఫిట్స్ కోల్పోతారని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది.

FOLLOW US: 
Share:

EPFO E-Nomination: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. మీరు మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోలేదా.. అయితే అందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation) తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది.  ఈ నామినేషన్‌ను మార్చి 31లోగా పూర్తి చేయాలంది. ఈపీఎఫ్ ఖాతాదారులు నామినీని నిర్ణీత గడువులోగా యాడ్ చేయకపోతే రిటైర్మెంట్‌కు సంబంధించిన ఈపీఎఫ్ఓ ప్రయోజనాలను మీరు పొందలేరని హెచ్చరించింది. కరోనా సమయంలో ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు అడ్వాన్స్ కింద రూ.1 లక్ష రూపాయాలను సైతం అందించారు. అంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రూల్స్ సరిగ్గా పాటిస్తే చాలా ప్రయోజనాలు మీ సొంతం.

ఈ నామినేషన్ తప్పనిసరి.. 
ఈపీఎఫ్ ఖాతాదారులు తమ జీవిత భాగస్వామిని లేక తల్లిదండ్రులు, తమ పిల్లలు ఇలా ఎవరిరైనా ఖాతాకు నామినీని యాడ్ చేసుకోవాలని పేర్కొంది. ఆన్‌లైన్ PF, పెన్షన్ మరియు బీమా ద్వారా వారిని రక్షించడానికి నామినేషన్లను నమోదు చేసుకోవడం చాలా కీలకమని పేర్కొంది. సబ్‌స్క్రైబర్స్‌కు ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఇ-నామినేషన్‌ (EPFO E-Nomination)ను పూర్తి చేసుకున్న వారికి కుటుంబసభ్యులకు ప్రయోజనాలు అందుతాయని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ పూర్తయిన తర్వాత, జరగరాని ప్రమాదం జరిగితే నామినీకి బీమా మరియు పెన్షన్ లాంటి ప్రయోజనాలను పొందగలుగుతారని ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది.

ఈ ప్రయోజనాలు అందుకోండి..
ఈ-నామినేషన్ పూర్తి చేసుకున్న వారు ఎంప్లాయ్​ డిపాజిట్​ లింక్డ్​ ఇన్సూరెన్స్ స్కీమ్​ (EDLI​) ద్వారా రూ.7 లక్షల బీమాకు అర్హులు అవుతారు. ప్రమాదవశాత్తూ ఈపీఎఫ్ ఖాతాదారులు చనిపోయినట్లయితే వారు పేర్కొన్న నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రమాద భీమా నగదును ఈపీఎఫ్ఓ అందిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలున్నాయి. కరోనా లాంటి కష్ట సమయాలలో సైతం ఈపీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ నగదు తీసుకునే ప్రయోజనాన్ని కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ కల్పించింది.
Also Read: EPF Interest Rate: కేంద్రం ఉన్నపళంగా పీఎఫ్ మీద వడ్డీ ఎందుకు తగ్గించింది..?

Also Read: EPFO E-Nomination: పీఎఫ్‌ డబ్బు కావాలా? ఈ-నామినేషన్‌ చేయండి మరి!

Published at : 29 Mar 2022 09:29 AM (IST) Tags: EPFO EPF EPFO E-Nomination Provident Fund E-Nomination EPF Nomination

ఇవి కూడా చూడండి

Gold Investment: స్టాక్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు

Gold Investment: స్టాక్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు

Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోయిందా?, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా డూప్లికేట్‌ ఆధార్ కార్డ్‌ పొందొచ్చు

Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోయిందా?, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా డూప్లికేట్‌ ఆధార్ కార్డ్‌ పొందొచ్చు

LIC Kanyadan Policy: మీ కుమార్తె భవిష్యత్‌ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!

LIC Kanyadan Policy: మీ కుమార్తె భవిష్యత్‌ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!

Gold-Silver Prices Today 16 Feb: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 16 Feb: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Inactive Credit Card: క్రెడిట్ కార్డ్‌ను పక్కన పడేశారా? - మీ క్రెడిట్‌ స్కోర్‌ మీ చేతులారా పాడు చేసుకుంటున్నట్లే!

Inactive Credit Card: క్రెడిట్ కార్డ్‌ను పక్కన పడేశారా? - మీ క్రెడిట్‌ స్కోర్‌ మీ చేతులారా పాడు చేసుకుంటున్నట్లే!

టాప్ స్టోరీస్

Minister Ramanaidu: మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు

Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ

Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ

Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?