అన్వేషించండి

Infosys Variable Pay: మొన్న విప్రో, నిన్న టీసీఎస్‌, నేడు ఇన్ఫీ! ఉద్యోగుల వేరియబుల్‌ పే తగ్గింపు!

Infosys Variable Pay: ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వరుస షాకులు ఇస్తున్నాయి. అట్రిషన్‌ రేటుతో భారీ వేతనాలు ఆఫర్‌ చేసే సంస్థలు ఇప్పుడు వేరియబుల్‌ పేను ఆలస్యం చేస్తున్నాయి.

Infosys Variable Pay: ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వరుస షాకులు ఇస్తున్నాయి. అట్రిషన్‌ రేటుతో భారీ వేతనాలు ఆఫర్‌ చేసే సంస్థలు ఇప్పుడు వేరియబుల్‌ పేను ఆలస్యం చేస్తున్నాయి. మరికొన్ని పర్సంటేజీ తగ్గిస్తున్నాయి. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ వేరియబుల్‌ పేను 70 శాతానికి తగ్గించినట్టు సమాచారం. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం, లాభదాయకత, మార్జిన్లు తగ్గడమే ఇందుకు కారణాలని తెలిసింది.

విప్రో ఈ మధ్యే కొందరు ఉద్యోగుల వేరియబుల్‌ పేను నిలిపివేసింది. మార్జిన్లపై ఒత్తిడి, టాలెంట్‌ సరఫరా గొలుసులో సామర్థ్యం లేకపోవడం, టెక్నాలజీలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి రావడమే ఇందుకు కారణాలుగా తెలిపింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ క్వార్టర్లీ వేరియబుల్‌ పేను కొందరు ఉద్యోగులకు నెల రోజులు ఆలస్యం చేసింది. ఇప్పుడు ఇన్ఫోసిస్‌ అదే బాటలో నడిచింది. 2023 ఆర్థిక ఏడాది, తొలి త్రైమాసికంలో వేరియబుల్ పే ఔట్‌ను 70 శాతానికి కుదించింది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు తెలియజేసింది.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ అంచనాలు అందుకోలేదు. ఖర్చులు ఎక్కువ అవ్వడంతో నికర లాభం కేవలం 3.2 శాతమే పెరిగింది. పూర్తి ఏడాది ఆదాయ వృద్ధిరేటు మాత్రం 14-16 శాతం వరకు ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఎక్కువ గిరాకీ, ఒప్పందాలు ఉన్నాయని వెల్లడించింది.

Also Read: పడిపోయిన ఐటీ స్టాక్స్‌! ఒడుదొడుకుల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

మార్జిన్‌ మార్గదర్శకాలను 21-23 శాతంగా ఉంచుకున్నా ఖర్చులు, పోటీ పెరగడంతో మార్జిన్లు తగ్గొచ్చని ఇన్ఫోసిస్‌ స్పష్టం చేస్తోంది. 2023 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ నిర్వాహక మార్జిన్లు 20 శాతంగా ఉండటం గమనార్హం. ఉద్యోగుల అధిక ప్రయోజనాల ఖర్చులు, సబ్‌ కాంట్రాక్టుల ఖర్చులు, ప్రయాణ ఖర్చులన్నీ కలిపి తడిసి మోపెడవుతున్నాయని వెల్లడించింది. అట్రిషన్‌ రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగుల ఖర్చులు పెరిగి ఐటీ పరిశ్రమ లాభదాయకతను తగ్గిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

కంపెనీ వృద్ధి రేటు మెరుగ్గా ఉందని, నియామకాల్లో ప్రతిభావంతుల కోసం పెట్టుబడులు పెడుతున్నామని, పోటీదారులకు దీటుగా వేతనాలు పెంచుతున్నామని తొలి త్రైమాసికం స్టేట్‌మెంట్లో ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ పేర్కొన్నారు. మార్జిన్లపై ఇప్పటికిప్పుడు వీటి ప్రభావం పడ్డా సుదీర్ఘ కాలంలో అట్రిషన్‌ రేట్‌ తగ్గుతుందని, భవిష్యత్తులో మెరుగైన స్థితిలో నిలుస్తామని ఆయన వెల్లడించారు. ప్రెషర్స్‌ రాకతో మార్జిన్లపై 160 బేసిస్‌ పాయింట్ల మేర ప్రభావం పడిందన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Infosys (@infosys)

టాప్ హెడ్ లైన్స్

Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget