అన్వేషించండి

Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే

Cryptocurrency 2025: బ్యాంక్‌బజార్ మనీమూడ్ 2025 చేసిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2022లో 32 శాతంతో పోలిస్తే 2024లో కేవలం 12 శాతం మంది భారతీయులు మాత్రమే క్రిప్టోలో పెట్టుబడి పెట్టారు.

Cryptocurrency In India: ఒకప్పుడు ఇండియాలో క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా ఉండేది. కానీ ఈ సంఖ్య పలు కారణాలు, రిస్క్ ల రిత్యా కాలక్రమేణా తగ్గుతూ వస్తోంది. ఇదే విషయంపై బ్యాంక్‌బజార్ మనీమూడ్ 2025 సర్వే చేసింది. క్రిప్టోకరెన్సీపై భారతీయుల ఆసక్తిపై ఓ రిపోర్ట్ ఇచ్చింది. 2022లో నమోదైన 32 శాతంతో పోలిస్తే 2024లో కేవలం 12 శాతం మంది భారతీయులు మాత్రమే క్రిప్టోలో పెట్టుబడి పెట్టినట్టు సర్వే రిపోర్టులో తెలిపింది. ఇప్పుడు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, గోల్డ్ వంటి వాటిపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్పింది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే..  మ్యూచువల్ ఫండ్ SIPలు 2024లో 62 శాతం సేవర్లను స్వాధీనం చేసుకున్నాయి. ఈక్రమంలోనే బంగారం 23.3 శాతం రాబడితో పుంజుకుంది.

ఒకప్పడు క్రిప్టో అప్పీల్ కు భారీ డిమాండ్ ఉండేది. కానీ భారీ పన్నులు, అనిశ్చితి, అస్థిరత కారణంగా మందగిస్తూ వచ్చింది. క్రిప్టో లాభాలపై భారత ప్రభుత్వం విధించిన 30 శాతం పన్ను, లావాదేవీలపై 1 శాతం TDSతో జతచేయడం వల్ల చాలా మందికి ట్రేడింగ్ చాలా ఖరీదైనదిగా మారింది. స్పష్టమైన నిబంధనలు లేకపోవటంతో, రిటైల్ పెట్టుబడిదారులను భయపెట్టే హై-రిస్క్ పరిస్థితుల్ని సృష్టించింది. దానికి తోడు స్కామ్ లు, భద్రతా ఉల్లంఘనలు మరింత దిగజార్చాయి.  2024లో జరిగిన పలు సంఘటనలు భారతీయ పెట్టుబడిదారులకు తీవ్ర నష్టం కలిగించాయి. దీని వల్ల చాలా మంది తక్కువ రిస్క్ ఉన్న ఆర్థిక సాధనాల కోసం దృష్టి మరలుస్తున్నారు. అయితే 2025 భారతదేశ ఈ క్రిప్టో ఉత్సాహాన్ని పునరుద్ధరించగలదా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

2025 ఎందుకు భిన్నంగా ఉండవచ్చంటే..

గతంలో అనేక ప్రతికూల ఘటనలు జరినప్పటికీ, క్రిప్టో 2025లో మళ్లీ పుంజుకోనుందని పలువురు భావిస్తున్నారు. బిట్‌కాయిన్ ఆల్-టైమ్ హై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాంతో పాటు సంస్థాగత పెట్టుబడిదారులు విశ్వసనీయతను జోడించి మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. అదనంగా, క్రిప్టోను అసెట్ క్లాస్‌గా గుర్తించే మైలురాయి కోర్టు తీర్పు ప్రభుత్వాన్ని స్పష్టమైన చట్టం తీసుకువచ్చేలా చేసింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న వడ్డీ రేట్లు కూడా క్రిప్టో వంటి ఊహాజనిత ఆస్తులకు అనుకూలంగా ఉన్నాయి. ఎలోన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రముఖుల రాకతో ఈ రంగం పునరాగమనానికి స్థానం కల్పించనుంది.

రిస్క్ లు ఎక్కువే

క్రిప్టో అనేది అస్థిరత కారణంగా అత్యంత ప్రమాదంగా కొనసాగుతోంది. ధరలు ఎప్పుడు తగ్గుతాయో, పెరుగుతాయో చెప్పలేం. అనుకోకుండా ఒక రోజు ఆకాశాన్ని తాకవచ్చు, మరుసటి రోజు పడిపోవచ్చు. కాబట్టి అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు కూడా కొన్నిసార్లు రిస్క్ నుంచి తప్పించుకోలేరు. సరైన నిబంధనలు లేకపోవటం అంటే మోసం లేదా నిర్వహణ లోపం విషయంలో చాలా తక్కువ ఆశ్రయం ఉంది. అంతేకాకుండా, క్రిప్టోను స్వీకరించడానికి భారత ప్రభుత్వం ఆసక్తి చూపట్లేదు. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ కూడా చాలా సందర్భాలలో యూజర్లను హెచ్చరించింది. ఇది దీర్ఘకాలిక వృద్ధిని అడ్డుకునే ప్రతికూల అవగాహనలకు దోహదపడింది.  

క్రిప్టోలో సురక్షితమైన మార్గం

క్రిప్టోను పరిగణించే వారికి, కొలిచే విధానం చాలా కీలకం. బలమైన భద్రతా ప్రోటోకాల్‌లతో విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించండి. క్రిప్టో ఎక్స్‌పోజర్ కొన్నిసార్లు మీరు ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదానికి తీసుకువస్తుంది. ఉదాహరణకు, మీరు రూ. 1 కోటి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటే.. అందులో కేవలం రూ. 1 లక్షను మాత్రమే కోల్పోవాల్సి వస్తుందంటే, ఈ అసెట్ క్లాస్‌లో మీ పోర్ట్‌ఫోలియోలో 1 శాతం మాత్రమే పెట్టుబడి పెట్టండి. ముఖ్యంగా పెట్టుబడి పెట్టడానికి రుణాలు తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేద ఎప్పుడైనా మారొచ్చు. ఎవరికీ అనుకూలం ఉండదు. మరీ ముఖ్యంగా, క్రిప్టో ఒక జూదం అని అర్థం చేసుకోండి.

ఇది అధిక లాభాలను అందించగలదు, కానీ కొన్నిసార్లు మీ దగ్గరున్న మొత్తాన్ని తుడిచిపెట్టగలదని గుర్తుంచుకోండి. ప్రస్తుతమున్న జనరేషన్ లో ఆర్థికంగా ఎదగడం చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యమైనది భద్రత అని తెలుసుకోండి.

Also Read  : Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్‌ బ్యాంక్‌లు - హోమ్‌ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
Embed widget