అన్వేషించండి

Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?

Train Tickets Advance Booking: రైలు టిక్కెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ వ్యవధిని 60 రోజులకు తగ్గించిన తర్వాత, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ రైల్వే బోర్డ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

Reduction Of Rail Tickets Advance Reservation Period: రైలు టికెట్ల రిజర్వేషన్‌ ముందస్తు బుకింగ్‌ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగడంతో, అన్ని అనుమానాలను తీరుస్తూ రైల్వే బోర్డ్‌ ‍‌(Indian Rail Board) ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవిధంగా చూస్తే, గడువు తగ్గింపు నిర్ణయంపై వివరణ ఇచ్చింది. రైలు టిక్కెట్ల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పిరియడ్‌ (ARP) ఎక్కువగా ఉండటం పెద్ద సంఖ్యలో క్యాన్సిలేషన్స్‌ జరుగుతున్నాయని, బెర్తులు వృథా అవుతున్నాయని రైల్వే బోర్డ్‌ తన వివరణలో వెల్లడించింది. క్యాన్సిలేషన్లు & బెర్తులు వృథాను తగ్గించి నిజమైన ప్రయాణీకులకు బెర్తులను అందుబాటులో ఉంచడమే రైల్వే శాఖ నిర్ణయం వెనకున్న ఉద్దేశమని స్పష్టం చేసింది.

21 శాతం టిక్కెట్లు క్యాన్సిల్‌ - 5 శాతం మంది నో జర్నీ
ప్రస్తుతం, రైల్వేలో టిక్కెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ 120 రోజులుగా ఉంది. అంటే, ప్రయాణ తేదీకి 120 రోజుల ముందే టిక్కెట్‌/టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని 60 రోజులకు తగ్గిస్తూ బుధవారం (16 అక్టోబర్‌ 2024) నాడు భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నిజమైన రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని తన వివరణలో రైల్వే బోర్డు తెలిపింది. 61 రోజుల నుంచి 120 రోజుల మధ్య చేసిన రిజర్వేషన్లలో 21 శాతం టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నట్లు తాము గమనించినట్లు వెల్లడించింది. 5 శాతం మంది ప్రయాణం చేయట్లేదు, టిక్కెట్‌ను కూడా రద్దు చేయట్లేదని పేర్కొంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో సీట్లు వృథా అవుతున్నాయంది. ఇది, సీట్ల కేటాయింపుల్లో మోసాలకు & రైల్వే అధికారులు లంచాలు తీసుకోవడానికి కారణమవుతోందని చెప్పింది. తాజా నిర్ణయంతో ఇలాంటి అక్రమాలను నిరోధించవచ్చని, నిజమైన ప్రయాణీకులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుందని రైల్వే బోర్డు వెల్లడించింది. పీక్ సీజన్‌లో ప్రత్యేక రైళ్లను నడపడంలోనూ ఈ నిర్ణయం ఇండియన్‌ రైల్వేస్‌కు సాయపడుతుందని తన ప్రకటనలో పేర్కొంది. 

కాలానుగుణంగా చాలా మార్పులు
పరిస్థితులను బట్టి, రైలు టిక్కెట్ల అడ్వాన్‌ బుకింగ్‌ గడువులో మార్పులు వస్తూనే ఉన్నాయని రైల్వే బోర్డు వెల్లడించింది. గతంలో ఈ గడువు 30-120 రోజుల మధ్య ఉండేదని గుర్తు చేసింది. 1981 నుంచి 2015 వరకు, కాలానుగుణంగా మార్పులు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. ఇన్నేళ్ల అనుభవాల తర్వాత, నిజమైన ప్రయాణికులకు 60 రోజుల గడువు ఉపయోగపడుతుందని గుర్తించినట్లు స్పష్టం చేసింది.

కొత్త నిర్ణయం నవంబర్‌ 1 నుంచి అమలు
రైలు టికెట్ల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పిరియడ్‌ను 60 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది నవంబర్‌ (01 నవంబర్‌ 2024) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నెలాఖరు (31 అక్టోబర్‌ 2024‌) వరకు 120 డేస్‌ పిరియడ్‌ అమల్లో ఉంటుంది. అంటే, 120 రోజుల కోసం ముందస్తుగా టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంటుంది. రైల్వే బోర్డు నిర్ణయం వల్ల ఇ-టికెట్‌లపై వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు నుంచి ఇంటర్నెట్ టికెటింగ్ ఆదాయం వరకు ఎటువంటి ప్రభావం చూపదని IRCTC కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

మరో ఆసక్తికర కథనం: ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Emergency Movie: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
Mrunal Thakur’s Pilgrimage Tour: ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
Atal Pension Yojana: ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
Jai Hanuman: ‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ హీరో, ప్రశాంత్ వర్మ ప్లాన్‌కు థియేటర్లు దద్దరిల్లాల్సిందేనా?
‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ హీరో, ప్రశాంత్ వర్మ ప్లాన్‌కు థియేటర్లు దద్దరిల్లాల్సిందేనా?
Embed widget