అన్వేషించండి

HMDA Plots E-Auction: తొర్రూర్, బహదూర్ పల్లిలో హెచ్ఎండీఏ ప్లాట్ల ఈ-వేలం, గజం ధర ఎంతంటే?

హెచ్ఎండీఏ పరిధిలోని రెండు వెంచర్లలో ప్లాట్ల అమ్మకానికి రెడీ అయ్యాయి. తొర్రూర్, బహదూర్ పల్లిలో మొత్తం 324 ప్లాట్ల ఈ-వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

తొర్రూర్, బహదూర్ పల్లిలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల(Plots)ను మరోసారి హెచ్ఎండీఏ వేలం వేయనుంది. హెచ్ఎండీఎ(HMDA) పరిధిలోని లే అవుట్లలోని 324 ప్లాట్లకు వేలం వేసేందుకు కార్యాచరణ పూర్తి చేసింది. బహదూర్ పల్లి(Bahadurpalli)లో 101 ప్లాట్లు, తొర్రూర్(Torroor) లో 223 ప్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మార్చి మూడో వారంలో ఈ-వేలం(E-Auction) ద్వారా ప్లాట్లను విక్రయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేడ్చల్ జిల్లాలోని బహదూర్ పల్లి, రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ లోని ప్లాట్లను ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో వేలం ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ సన్నాహాలు చేసింది. మల్టీ పర్పస్ జోన్ కింద ఈ లేఅవుట్లను హెచ్ఎండీఏ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. వచ్చే నెల 14, 15 తేదీల్లో బహదూర్‌పల్లిలోని 101 ప్లాట్లు, తొర్రూర్‌లోని 223 ప్లాట్లను వచ్చే నెల 14 నుంచి 17 వరకు ఈ-వేలం వేస్తామని అధికారులు ప్రకటించారు.  ఇప్పటికే కోకాపేట్‌(Kokapeta), ఖానామెట్‌, ఉప్పల్‌ భగాయత్‌ భూములను హెచ్ఎండీఏ విజయవంతంగా విక్రయించింది. 

రేపటి నుంచి ప్రీబిడ్ 

బహదూర్ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్(Layout) లో 101 పాట్లు ఈ-వేలం వేసేందుకు ఫిబ్రవరి 23న ప్రీబిడ్ మీటింగ్ జరగనుంది. బహదూర్ పల్లిలో మేకల వెంకటేశ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఉదయం 11 గంటలకు ప్రీబిడ్ మీటింగ్ ఉంటుంది. అలాగే తొర్రూర్ లోని 117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ లేఅవుట్ ను అభివృద్ధి చేసి, అందులోని 223 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించనుంది. దీనికి సంబంధించి ప్రీబిడ్ మీటింగ్ ఈనెల 25వ తేదీన తోర్రూర్ సైట్ లోనే నిర్వహించనున్నారు. బహదూర్‌పల్లిలో గజానికి రూ.25 వేలు, తొర్రూర్‌లో గజానికి రూ.20 వేలు కనీస ధరను హెచ్ఎండీఏ నిర్ణయించింది. బహదూర్‌ పల్లిలో 600 గజాల వరకు ఒక్కో ప్లాటుకు రూ.3 లక్షలు, 600 గజాలు దాటితే రూ.5 లక్షలు, తొర్రూరులో ఒక్కో ప్లాట్‌కు రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

కోట్లు పలికిన కోకాపేట భూములు

కోకాపేట, ఉప్పల్ భగాయత్ వెంచర్లలో ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ భూములకు రూ.వేల కోట్లు పలికాయి. తాజాగా మరో రెండు వెంచర్లలో ప్లాట్ల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వెంచర్ల(Venture) ప్లాట్ల విక్రయం ద్వారా కూడా కోట్లాది రూపాయలు సమకూర్చుకునే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: Mutual Funds: ప్రతిరోజూ రూ.100 SIP - సరికొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Adobe CEO Shantanu Narayen : అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Iran war threat: యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?
యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget